మమత సర్కార్‌కు ఎదురుదెబ్బ

` 2010 తరవాత జారీ చేసిన ఓబీసీ సర్టిఫికెట్ల రద్దు
` కోల్‌కతా హైకోర్టు సంచలన తీర్పు
` తీర్పును అంగీకరించమన్న మమతా బెనర్జీ
కోల్‌కతా(జనంసాక్షి):లోక్‌సభ ఎన్నికల వేళ పశ్చిమబెంగాల్‌లో మమతా బెనర్జీ నేతృత్వంలోని తృణమూల్‌ కాంగ్రెస్‌ ప్రభుత్వానికి గట్టి ఎదురుదెబ్బ తగిలింది. ఇటీవల ఉపాధ్యాయ నియామక కుంభకోణం కేసులో 26వేల మంది టీచర్ల ఉద్యోగాలు రద్దు చేసిన కలకత్తా హైకోర్టు బుధవారం మరో సంచలన తీర్పు వెలువరించింది. ఓబీసీలో పలు క్లాసులను కొట్టివేసింది. 2010 తర్వాత నుంచి రాష్ట్ర ప్రభుత్వం జారీ చేసిన అన్ని ఓబీసీ ధ్రువపత్రాలను రద్దు చేస్తూ ఉత్తర్వులిచ్చింది. 2012 నాటి పశ్చిమ బెంగాల్‌ వెనకబడిన వర్గాల చట్టంలోని కొన్ని నిబంధనలు చట్టవిరుద్ధంగా ఉన్నాయంటూ హైకోర్టులో పిటిషన్లు దాఖలయ్యాయి. వీటిపై విచారణ జరిపిన ద్విసభ్య ధర్మాసనం.. 2010`12 మధ్య రాష్ట్ర ప్రభుత్వం ఓబీసీ వర్గీకరణలుగా పేర్కొన్న 42 క్లాసులను కొట్టివేస్తున్నట్లు వెల్లడిరచింది. ఆ వర్గీకరణలు చట్టవిరుద్ధంగా ఉన్నాయని స్పష్టంచేసింది. అందువల్ల 2010 తర్వాత ఈ క్లాసుల కింద జారీ చేసిన ఓబీసీ సర్టిఫికెట్లన్నిం టిని రద్దు చేస్తూ తీర్పు వెలువరించింది. 1993 నాటి వెనకబడిన వర్గాల చట్టానికి అనుగుణంగా కొత్త ఓబీసీ జాబితాను సిద్ధం చేయాలని సంబంధిత అధికారులను ఆదేశించింది. అయితే, ఈ క్లాసులతో జారీ అయిన ఓబీసీ ధ్రువపత్రాలతో ఇప్పటికే ప్రయోజనాలు పొందుతున్నవారు, ఆ రిజర్వేషన్ల కింద ఉద్యోగాలు చేస్తున్నవారిపై ఈ తీర్పు ఎలాంటి ప్రభావం చూపదని న్యాయస్థానం వెల్లడిరచింది. 1993లో చేసిన చట్టానికి విరుద్ధంగా పత్రాలు జారీ చేశారని న్యాయమూర్తులు తపబ్రత చక్రవర్తి, రాజశేఖర్‌ మంతాతో కూడిన హైకోర్టు ధర్మాసనం తమ తీర్పులో స్పష్టం చేసింది. అయితే, తమ ఉత్తర్వుల ప్రభావం ఇప్పటికే ఉద్యోగాలు, పథకాల లబ్ది పొందిన వారిపై ఎటువంటి ప్రభావం చూపవని తెలిపింది. 2010కి ముందు 66 తరగతులుగా క్లాసిఫై చేసిన ఓబీసీల జోలికి తాము వెళ్లడం లేదని, పిటిషన్‌లో వాటిని సవాలు చేయలేదని ధర్మాసనం పేర్కొంది. హైకోర్టు తీర్పుపై రాష్ట్ర ముఖ్యమంత్రి మమతా బెనర్జీ అసంతృప్తి వ్యక్తంచేశారు. దీన్ని తాము అంగీకరించబోమని తెలిపారు. ఓబీసీ రిజర్వేషన్లకు సంబంధించి ఇంటింటి సర్వే నిర్వహించి బిల్లు తీసుకొచ్చాం. రాజ్యాంగానికి లోబడి తీసుకొచ్చిన ఈ బిల్లును శాసనసభ ఆమోదించింది. ఇప్పుడు భాజపా కేంద్ర దర్యాప్తు సంస్థలను ఉపయోగించి దీన్ని నిలిపివేయాలని కుట్ర పన్నింది. ఈ తీర్పును మేం అంగీకరింబోం. ఓబీసీ రిజర్వేషన్లు కొనసాగుతాయని దీదీ స్పష్టంచేశారు.