మయన్మార్‌లో సరిహద్దులో భూకంపం

మయన్మార్‌: మయన్మార్‌-భారత సరిహద్దు ప్రాంతంలో మంగళవారం ఉదయం భారీ భూకంపం సంభవించింది.దీని తీవ్రత రిక్టర్‌స్కేల్‌పై 5.5గా నమోదైంది. ఒక్కసారిగా భూమి కంపించడంతో ప్రజలు భయాందోళనకు గురై ఇళ్ల నుంచి బయటికి పరుగులు తీశారు. అస్సోంలోని కర్బీ అంగ్‌లాంగ్‌ జిల్లాలోనూ 3.1 తీవ్రతతో ప్రకంపనలు సంభవించాయి. అయితే ఎలాంటి ప్రాణ, ఆస్తి నష్టం సంభవించలేదని అధికారులు వెల్లడించారు. సోమవారం దిల్లీ, హరియాణాలో స్వల్ప భూప్రకంపనలు సంభవించిన విషయం తెలిసిందే.