మల్కీజుగుడ గ్రామంలో ఆర్థిక అక్షరాస్యత అవగాహన సదస్సు

రంగారెడ్డి/ఇబ్రహీంపట్నం, జులై 13 (జనంసాక్షి):- తెలంగాణ గ్రామీణ బ్యాంకు సేవల్ని వినియోగించుకోవాలని యాచారం శాఖ బ్రాంచ్ మేనేజర్ కళ్యాణ్ అన్నారు. తెలంగాణా గ్రామీణ బ్యాంకు యాచారం శాఖ ఆధ్వర్యంలో బుధవారం మల్కీజుగుడ గ్రామంలో ఆర్థిక అక్షరాస్యత అవగాహన సదస్సు నిర్వహించారు. సదస్సులో భాగంగా కళాజాత బృందం వారిచే బ్యాంకు ప్రయోజనాలపై ప్రజలకు అవగాహన కల్పించారు.  కార్యక్రమంలో సర్పంచ్ చీర యాదమ్మ, గ్రామ పెద్దలు, మహిళా సంఘాలు పాల్గొన్నారు
Attachments area