మల్లన్న సేవలో హైకోర్టు న్యాయమూర్తి
శ్రీశైల, నవంబర్21(జనంసాక్షి) : శ్రీశైల పుణ్యక్షేత్రంలో కొలువైన భ్రమరాంబ, మల్లికార్జున స్వామి వార్లను బుధవారం హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ ఎస్.వి.భట్ కుటుంబ సమేతంగా దర్శించుకున్నారు. వీరికి ఆలయ మహాద్వారం వద్ద దేవస్థానం అధికారులు సాదర స్వాగతం పలికారు. అనంతరం న్యాయమూర్తి కుటుంబ సభ్యులతో కలసి మహామంగళ హారతి సేవలో పాల్గొని రుద్రాభిషేకం, కుంకుమార్చన పూజలు చేశారు. వేదపండితులు ఆశీర్వచనాలు పలికి తీర్ధ ప్రసాదాలను ఆయనకు అందజేశారు.