మళ్లీ గెలుస్తా..మంత్రినవుతా: ఎర్రబెల్లి 

జనగామ,మే7(జ‌నం సాక్షి): వచ్చే ఎన్నికల్లో తాను భారీ మెజార్టీతో గెలిచి మంత్రినవుతానని పాలకుర్తి ఎమ్మెల్యే ఎర్రబెల్లి దయాకర్రావు అన్నారు.  అప్పుడు తండాల్లో, గ్రామాల్లో ఏ సమస్య ఉన్నా తానే బాధ్యత వహిస్తానన్నా రు. తండాలను గ్రామపంచాయతీలను చేసి చూపిన ఘన త టీఆర్‌ఎస్‌ ప్రభుత్వానిదే అన్నారు. సమస్యలుంటే తన దృష్టికి తేవాలని, చిన్న విషయాలకు పార్టీలు మారితే ఒరిగేదేంలేదని, కేసీఆర్‌ ప్రభుత్వం అమలు చేస్తున్న పథకాలు, తాను నియోజకవర్గంలో చేస్తున్న అభివృద్ధి చూడాలన్నారు. విూ వెంటే ఉంటున్నానని, మళ్లీ వచ్చేది టీఆర్‌ఎస్‌ ప్రభుత్వమేనని అన్నారు.  తండాలను గ్రామపంచాయతీ చేసిన టీఆర్‌ఎస్‌ ప్రభుత్వం వెంట, స్థానికంగా అభివృద్ధి చేస్తున్న ఎమ్మెల్యే దయాకర్‌రావు వెంటే తామంతా ఉంటామంటూ ముక్తకంఠంతో కడవెండి శివారు పొట్టిగుట్టతండా వాసులు తెలిపారు. ఈ సందర్బంగా ఎమ్మెల్యే దయాకర్‌రావు వారందరిని అభినందించి, కండువాలు కప్పి తండావాసులతో కలిసి ముచ్చటించారు. ఇక తాగునీరు, సాగునీరు, మేలైన విత్తనాలు, సకాలంలో ఎరువులు, పంటకు పెట్టుబడి, ఇంకా అనేక అభివృద్ధి సంక్షేమ పథకాలు చేస్నున్న టీఆర్‌ఎస్‌ పార్టీపై ప్రజల్లో ఎలాంటి అసంతృప్తి లేదన్నారు.