మళ్లీ దర్జాగా దర్శనమిచ్చిన విజయ్‌మాల్యా

13brk-mallyaలండన్: భారత బ్యాంకులకు 8 వేల కోట్లకు పైగా ఎగనామం పెట్టి లండన్‌కు పోయిన వ్యాపారవేత్త విజయ్ మాల్యా మరోసారి దర్జాగా దర్శనమిచ్చారు. బ్రిటీష్ గ్రాండ్ ప్రీ ఫార్ములా వన్ సర్క్యూట్‌ను సందర్శించాడు. ఐపీఎల్ మ్యాచ్ చూసేందుకు టైం ఉంది. పుస్తకావిష్కరణకు సమయం ఉంది. ఫార్ములా వన్ సర్క్యూట్ చూసేందుకు కూడా వీలుంది కానీ భారత్ పంపిన సమన్లకు బదులిచ్చేందుకు మాల్యా దగ్గర సమయం లేదా అని నెటిజన్లు ప్రశ్నిస్తున్నారు.