మహనీయులు చూపిన సన్మార్గంలో నడుచుకోవాలి.

జిల్లా ప్రధాన కార్యదర్శి యు రమేష్ కుమార్.
తాండూరు జులై 14(జనంసాక్షి)మహనీయులు చూపిన సన్మార్గంలో నడుచుకుం దామని వికారాబాద్ జిల్లా ప్రధాన కార్యదర్శి యు రమేష్ కుమార్ పేర్కొన్నారు.భారతీయ జనతా పార్టీ జిల్లా ప్రధాన కార్యదర్శి యు రమేష్ కుమార్ ఆధ్వర్యంలో గురు పూర్ణిమ పురస్క రించుకొని బషీరాబాద్ మండలం నావల్గ బొజ్జ నాయక్ తండ శంకర్ బౌజి స్వామిని ఘనంగా నిర్వహించారు. ఈసందర్భంగా రమేష్ కుమార్ మాట్లాడుతూ సనాతన ధర్మం గురించి వివరిస్తూ సన్మార్గంలో నడిపిస్తూ వారికి ఆధ్యాత్మిక దైవ చింతన వైపు నడిపిస్తున్న శ్రీ శంకర్ భౌజీ మహారాజ్ కి గురు పౌర్ణమి రోజు సన్మానించు కోవడం చాలా ఆనందంగా ఉందని తెలిపారు. మహనీయులకు మనమందరం వారు చూపిన సన్మార్గంలో నడుచుకుంటూ మన వంతు సమాజానికి సేవ చేసుకునే భాగ్యాన్ని మనం కలుగజేసుకున్నారని వారు తెలిపారు. శంకర్ మహరాజ్ జీ మాట్లాడుతూ గురు పౌర్ణమి పురస్కరించుకుని భారతీయ జనతాపార్టీ నాయకులు సన్మానించడం ఎంతో సంతోషదా యకరమన్నారు. ఆనందాన్ని ఇచ్చిందని ఎల్లవేళలా ఆశీస్సులు మీ అందరిపై ఉంటాయని ఆశీర్వదించారు.ఈ కార్యక్రమంలో రాష్ట్ర స్పోర్ట్స్ కన్వీనర్ భాను పవర్ ,బషీరాబాద్ మండల ఇన్చార్జ్ రమ్య నాయక్ ,సీనియర్ నాయకులు పూజారి పండు ,చంద్రశేఖర్ , తదితరులు ఉన్నారు.