మహాత్మా గాంధీ చూపిన శాంతి సామరస్యం ద్వారా ఏ సమస్యనైనా పరిష్కరించుకోవచ్చు

-జిల్లా కలెక్టర్ వల్లూరు క్రాంతి.
గద్వాల నడిగడ్డ, అక్టోబర్ 2 (జనం సాక్షి);
భారత జాతిపిత మహాత్మా గాంధీ చూపిన శాంతి సామరస్యం ద్వారా ఏ సమస్య అయినా పరిష్కరించుకోవచ్చు అని జిల్లా కలెక్టర్ వల్లూరు క్రాంతి అన్నారు.
ఆదివారం గాంధీ చౌక్ లోఉన్న జాతి పిత మహాత్మా గాంధీ 153 వ జయంతి సందర్భంగా గాంధీ విగ్రహానికి పూల మాల వేసి ఘనంగా నివాళులు అర్పించారు. అనంతరం జిల్లా కలెక్టర్ కార్యాలయంలో మహాత్మా గాంధీ చిత్రపటానికి పూల మాల వేసి నివాళులు అర్పించారు. గాంధీజీ ప్రపంచానికే ఆదర్శంగా నిలిచారని కొనియాడారు.ఈ సందర్బంగా జిల్లా ప్రజలకు మహాత్మాగాంధీ జయంతి శుభాకాంక్షలు తెలిపారు.
ఈ కార్యక్రమం లో మున్సిపల్ కమీషనర్ జానకి రామ్ సాగర్, డి పి ఆర్ ఓ చెన్నమ్మ ,ఎం ఆర్ ఓ వెంకటేశ్వర్లు,ఏ ఓ యాదగిరి,
సూపర్డెంట్ రాజు,ఆర్ ఐ వెంకటేశ్వర్ రెడ్డి,కార్యాలయ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.