మహిళపై దాడి..బంగారం దోపిడీ
కరీంనగర్,మార్చి30జనంసాక్షి: కరీంనగర్ నగరంలోని బైపాస్ రోడ్డులో గుర్తుతెలియని దుండగులు ఓ మహిళపై దాడి చేసి, ఆమె నుంచి 30 తులాల బంగారు నగలను అపహరించుకెళ్లారు. బాధిత మహిళ ఫిర్యాదుతో పోలీసులు రంగంలోకి దిగి దొంగల కోసం గాలింపు ఆరంభించారు.