మహిళా మనులకు గాజుల వితరణ..

మాజీ కౌన్సిలర్ పరిమళ రవిందర్..
తాండూరు జనవరి 7(జనంసాక్షి)రాబోయేసంక్రాంతి పండుగ సందర్భంగా వచ్చిన భారాన్ని తగ్గించడానికి ఇద్దరు కొడుకులు ఉన్నవాళ్లు ఎవరికైతే ఒక్కరే కొడుకు ఉన్న తల్లులకుమాజీ మున్సిపల్ కౌన్సిలర్ పరిమళ రవిందర్
మహిళా మనులకు గాజుల వితరణ చేశారు.ఆదివారం తాండూరు పట్టణం 23వ వార్డుశ్రీరేణుక ఎల్లమ్మ ఆలయ ప్రాంగణంలోమహిళ మనులకు గాజులు తొడగించడం నిర్వహించారు. ఈ సందర్భంగా మాజీ కౌన్సిలర్ పరిమళ రవిందర్ మాట్లాడుతూ ప్రతి ఒక్కరి కుటుంబంలో సుఖశాంతులు అష్టైశ్వర్యాలు ఆనందాలు సంతోషాలు ఉండాలని సంక్రాంతి సందర్భంగా ఒక కొడుకు ఉన్న వారికి ఎటువంటి అపాయముమరియు ప్రమాదం జరగకూడదని
గాజుల వితరణ చేపట్టడం జరిగిందన్నారు. మహిళల శ్రేయస్సు కోసం మాజీ కౌన్సిలర్ పరిమళ రవీందర్ చక్కటి కార్యక్రమం చేపట్టడం జరిగిందని అభినందయకమన ఆలయ కమిటీ సభ్యులు వారికి ధన్యవాదాలు కృతజ్ఞతలు తెలిపారు.