మహిళ సమైక్య సంఘాలతో సమీక్ష సమావేశం

మొండిబకాయలను పూర్తిస్థాయిలో రికవరీ చేయించాలి:స్త్రీ నిధి జిల్లా రీజినల్ మేనేజర్ మధుసూదన్

 

కొత్తగూడ జనంసాక్షి:మహబూబాబాద్ జిల్లా కొత్తగూడ మండల మహిళ సమైక్య కేంద్రంలో విఓఏ లతో సమీక్ష సమావేశమును నిర్వహించడం జరిగింది.ఈ సమావేశానికి స్త్రీ నిధి జిల్లా రీజినల్ మేనేజర్ మధుసూదన్ హాజరై మాట్లాడుతూ గ్రామ,స్వయం సహాయక సంఘం వారీగా సమీక్ష చేసి 141 సంఘాలలో 48.00 లక్షల ఉన్న (52%) మొండి బకాయి లను పూర్తిస్థాయిలో రికవరీ చేయించి సంఘం నుండి స్త్రీ నిధి ఖాతాకు బదిలీ చేయాలని ఆదేశించారు.అదే విధంగా జిల్లాలో కొన్ని గ్రామ సంఘాలలో నిర్వహించిన సామాజిక తనిఖీలో బయటపడిన అవకతవకలకు పాల్పడిన బాధ్యుల మీద తగు చర్యలు తీసుకోబడును అని హెచ్చరించారు.ఈ సమావేశంలో ఇండియన్ బ్యాంక్ మేనేజర్ బాల జ్యోతి,కొత్తగూడ సీసీలు వివిధ గ్రామాల వి.ఓ.ఏ లు పాల్గొన్నారు.