మాకు నీళ్లే కావాలి.. పంచాయతీ వద్దు

` వివాదాలు కాదు..పరిష్కారాలు ముఖ్యం
` ఉమ్మడి రాష్ట్రంలోప్రాజెక్టులకు అడ్డు పడకండి
` జలవివాదాలతో రాజకీయ ప్రయోజనం కోరుకోం
` మన సమస్యలను మనమే కలిసి పరిష్కరించుకుందాం
` ఏపీ సీఎం చంద్రబాబుకు తెలంగాణ సీఎం రేవంత్‌ సూచన
` కృష్ణా జలాలపై ఏపీతో చర్చలకే ప్రాధాన్యం
` రంగారెడ్డి జిల్లా రావిర్యాలలో సుజెన్‌ మెడికేర్‌ ప్రారంభోత్సవం
హైదరాబాద్‌(జనంసాక్షి): రెండు తెలుగు రాష్టాల్ర మధ్య వివాదాలు ఉండకూడదనే కాంగ్రెస్‌ తెలంగాణ ఇచ్చిందని సీఎం రేవంత్‌ రెడ్డి అన్నారు. రాజకీయాలకు అతీతంగా నీళ్ల సమస్యను పరిష్కరించు కోవాలని చెప్పారు. కోర్టుల్లో కాకుండా.. మన సమస్యలను మనమే పరిష్కరించుకుందామని విజ్ఞప్తి చేశారు. లో సీఎం రేవంత్‌ మాట్లాడుతూ నీళ్ల సమస్యపై స్పందించారు. జల వివాదం విషయంలో రాజకీయ ప్రయోజనం పొందాలని తమ ప్రభుత్వం ప్రయత్నించడం లేదని స్పష్టం చేశారు. పంచాయితీ కావాలా.. నీళ్లు కావాలా.. అని నన్ను అడిగితే తెలంగాణకు నీళ్లే కావాలని చెబుతా. వివాదాలు కావాలా.. పరిష్కారం కావాలా.. అని అడిగితే పరిష్కారం కావాలని చెబుతా. మన సమస్యలను మనమే సామరస్యంగా పరిష్కరించుకుందాం. ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబుకు ఈ వేదికగా ఓ విజ్ఞప్తి చేస్తున్నా. కృష్ణా నదిపై ఉమ్మడి రాష్ట్రంలో ఉన్న ప్రాజెక్టుల అనుమతులకు అడ్డంకులు పెట్టకండి. ఇలా అడ్డంకులతో కేంద్ర ప్రభుత్వం నిధులు రావడం లేదన్నారు. రాష్ట్రంపై ఆర్థిక భారం పడుతోంది. మేం వివాదాలు కోరుకోవడం లేదు. పరిష్కారం కోరుకుంటున్నాం అని అన్నారు. రాజకీయ ప్రయోజనాలు కాదు.. ప్రజల ప్రయోజనాలు కోసం ఆలోచిస్తున్నాం. తెలంగాణకు పోర్టు కనెక్టివిటీ రావాలంటే పక్క రాష్ట్రం సహకారం ఉండాలి. రెండు రాష్టాల్రు పరస్పరం సహకరించుకుంటేనే సమస్యలు పరిష్కారం అవుతాయి. ఏపీ, కర్ణాటక, మహారాష్ట్ర, తమిళనాడు.. ఏ రాష్ట్రమైనా సరే మేం వివాదాలు కోరుకోవడం లేదు. ఈ విషయంలో ఏపీ సర్కారు ఒక్క అడుగు ముందుకు వేస్తే.. తెలంగాణ 10 అడుగులు ముందుకు వేస్తుందని సీఎం హావిూ ఇచ్చారు. ఈ మేరకు కృష్ణా నది జల వివాదంపై ముఖ్యమంత్రి రేవంత్‌ రెడ్డి కీలక వ్యాఖ్యలు చేశారు. నీళ్ల వివాదం ముసుగులో రాజకీయ లబ్ది పొందాలన్న ఆలోచన కాంగ్రెస్‌ పార్టీకి లేదని, రాజకీయాలకు అతీతంగా సమస్యల పరిష్కారం కోసం అందరూ సహకరించాలని పార్టీలను విజ్ఞప్తి చేస్తున్నట్లు తెలిపారు. మన సమస్యలను సామరస్యంగా పరిష్కరించుకుందామని ముఖ్యమంత్రి పిలుపునిచ్చారు. ఈ వేదికగా ఆంధప్రదేశ్‌ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుకి విజ్ఞప్తి చేస్తూ.. కృష్ణా నదిపై ఉమ్మడి రాష్ట్రంలో ఉన్న ప్రాజెక్టుల అనుమతులకు అడ్డంకులు పెట్టవద్దని కోరారు. అడ్డంకుల వల్ల కేంద్ర ప్రభుత్వ నిధులు రావడం లేదని, రాష్ట్రంపై ఆర్థిక భారం పడుతోందని ఆవేదన వ్యక్తం చేశారు. తాము వివాదం కోరుకోవడం లేదని.. పరిష్కారమే కోరుకుంటున్నామని స్పష్టం చేశారు. రాజకీయ ప్రయోజనాలు కాదని.. ప్రజలు, రైతుల ప్రయోజనాల కోసమే ఆలోచిస్తున్నామని రేవంత్‌ రెడ్డి స్పష్టీకరించారు. తెలంగాణకు పోర్టు కనెక్టివిటీ రావాలంటే పక్క రాష్ట్రం సహకారం అవసరమన్నారు. కార్యక్రమంలో శాసనసభ స్పీకర్‌ గడ్డం ప్రసాద్‌ కుమార్‌, మంత్రి శ్రీధర్‌ బాబు, ఎంపీ అనిల్‌ కుమార్‌ యాదవ్‌, శాసన మండలి చీఫ్‌ విప్‌ పట్నం మహేందర్‌ రెడ్డి, ఎమ్మెల్యేలు ప్రకాశ్‌ గౌడ్‌, మల్‌ రెడ్డి రంగారెడ్డి, కాలె యాదయ్య, తదితరులు పాల్గొన్నారు.

గ్లోబల్‌ డెస్టినేషన్‌గా తెలంగాణ
` 2047 లక్ష్యంగా 3 ట్రిలియన్‌ డాలర్ల ఎకానమీ
` క్యూర్‌`ప్యూర్‌`రేర్‌తో డెవలప్‌మెంట్‌ మోడల్‌
` గ్లోబల్‌ ఫ్యూచర్‌ సిటిగా హైదరాబాద్‌
` ముఖ్యమంత్రి రేవంత్‌ రెడ్డి
హైదరాబాద్‌(జనంసాక్షి):హైదరాబాద్‌ నగరం నేడు ప్రపంచ స్థాయి నగరాలతో పోటీ పడుతోందంటే అది గత మూడు దశాబ్దాల నిరంతర శ్రమ ఫలితమేనని ముఖ్యమంత్రి రేవంత్‌ రెడ్డి కొనియాడారు. జర్మన్‌ టెక్నాలజీతో దక్షిణ భారతదేశంలోనే అతిపెద్ద ఐవీ ఫ్లూయిడ్స్‌ తయారీ యూనిట్‌ను ఏర్పాటు చేసిన సుజెన్‌ మెడికేర్‌ యాజమాన్యాన్ని ఆయన అభినందించారు. ’తెలంగాణ రైజింగ్‌ 2047’ విజన్‌లో భాగంగా ఇటువంటి తయారీ యూనిట్లు రావడం రాష్ట్ర పారిశ్రామికాభివృద్ధికి నిదర్శనమని ఆయన పేర్కొన్నారు.రాష్ట్ర అభివృద్ధి కోసం క్యూర్‌ , ప్యూర్‌ , రేర్‌ అనే మూడు విభాగాలుగా అభివృద్ధి ప్రణాళికను రూపొందించినట్లు సీఎం తెలిపారు. గ్లోబల్‌ సమ్మిట్‌ ద్వారా ఇప్పటికే తెలంగాణ పాలసీ డాక్యుమెంట్‌ను విడుదల చేశామని, 2034 నాటికి 1 ట్రిలియన్‌ డాలర్ల ఎకానవిూగా, 2047 నాటికి 3 ట్రిలియన్‌ డాలర్ల ఎకానవిూగా తెలంగాణను తీర్చిదిద్దడమే తమ అంతిమ లక్ష్యమని ఆయన ప్రకటించారు. ప్రస్తుతం దేశంలో ఉత్పత్తి అవుతున్న బల్క్‌ డ్రగ్స్‌లో 40 శాతం వాటా తెలంగాణదేనని, ఫార్మా రంగంలో ప్రపంచమే మన వైపు చూసేలా ఎదుగుతున్నామని గర్వంగా చెప్పారు. ప్రపంచ నగరాలతో హైదరాబాద్‌ పోటీ పడుతోంది. సుజెన్‌ మెడికేర్‌ నిరుద్యోగ యువతకు ఉపాధి కల్పిస్తోంది. పెట్టుబడులకు లాభం వచ్చేలా ప్రభుత్వ ప్రణాళికలు ఉన్నాయి. ప్రపంచ స్థాయి దేశాలతో తెలంగాణ పోటీపడేందుకు ప్రభుత్వం కృషి చేస్తోంది. పెట్టుబడులకు అనుకూల మైన వాతావరణం మన రాష్ట్రంలో ఉంది. పెద్ద కంపెనీలకు సీఈవోలుగా ఉన్నది.మన దేశం వాళ్లే అని సీఎం అన్నారు. రాజకీయ వివాదాల కంటే సమస్యల పరిష్కారానికే తాము ప్రాధాన్యత ఇస్తామని ముఖ్యమంత్రి స్పష్టం చేశారు.ఉమ్మడి రాష్ట్రంలో ఉన్న ప్రాజెక్టుల అనుమతులకు అడ్డంకులు సృష్టించవద్దని, అడ్డంకుల వల్ల కేంద్ర నిధులు రాక రాష్ట్రంపై ఆర్థిక భారం పడుతోందని ఆయన పేర్కొన్నారు.తెలంగాణకు పోర్టు కనెక్టివిటీ రావాలన్నా, నీటి సమస్యలు తీరాలన్నా ఏపీతో పాటు కర్ణాటక, తమిళనాడు, మహారాష్ట్ర వంటి పొరుగు రాష్టాల్ర సహకారం అవసరమని, అందుకే తాము వివాదాల కంటే సామరస్యపూర్వక చర్చలకే మొగ్గు చూపుతామని రేవంత్‌ రెడ్డి స్పష్టం చేశారు. రాజకీయ ప్రయోజనాల కోసం కాకుండా ప్రజల , రైతుల ప్రయోజనాల కోసమే తమ ప్రభుత్వం ఆలోచిస్తుందని ఆయన హావిూ ఇచ్చారు.యువ పారిశ్రామికవేత్తలను ప్రోత్సహించడం ద్వారా నిరుద్యోగులకు ఉపాధి కల్పించడమే ధ్యేయంగా ప్రైవేట్‌ రంగ పెట్టుబడులను ఆహ్వానిస్తున్నట్లు సీఎం తెలిపారు. రాబోయే పదేళ్లలో హైదరాబాద్‌లోని ’ఫ్యూచర్‌ సిటీ’లో నివసిస్తున్నామని ప్రతి ఒక్కరూ గర్వంగా చెప్పుకునేలా నగరాన్ని అభివృద్ధి చేస్తామని ఆయన ధీమా వ్యక్తం చేశారు. జర్మనీ, జపాన్‌, సౌత్‌ కొరియా వంటి దేశాలతో పోటీ పడుతూ తెలంగాణను గ్లోబల్‌ డెస్టినేషన్‌గా మార్చడమే తమ సంకల్పమని రేవంత్‌ రెడ్డి పునరుద్ఘాటించారు.