మాజీ ఎంపీ పొంగులేటి కుమార్తె వివాహ ఆహ్వాన పత్రిక, కానుక పంపిణీ

 

జూలూరుపాడు, ఆగష్టు 5, జనంసాక్షి:

ఈనెల 17వ తేదీన మాజీ పార్లమెంటు సభ్యులు పొంగులేటి శ్రీనివాసరెడ్డి కుమార్తె వివాహం ఖమ్మం పట్టణంలోని ఎస్ఆర్ గార్డెన్ లో జరుగనుంది. ఈ మేరకు వెంగన్నపాలెం దత్తనగర్ లోని షిర్డీ సాయి బాబా మందిరంలో టిఆర్ఎస్ నాయకులు, సొసైటీ చైర్మన్ లేళ్ల వెంకటరెడ్డి, ఎంపిపి లావుడ్యా సోని, ఎంపిటిసి దుద్దుకూరి మధుసూదనరావు పలువురు శుక్రవారం ప్రత్యేక పూజలు చేశారు. అనంతరం వివాహ ఆహ్వాన పత్రికతో పాటు కానుకగా అందజేసే గడియారాలను ఇంటింటికీ పంపిణీ చేసే కార్యక్రమాన్ని ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో టిఆర్ఎస్ నాయకులు ధారవత్. రాంబాబు, చిన్న నాగేశ్వరావు, పోతురాజు నాగరాజు, కోట కుమార్ బాబు, సాయిల కృష్ణయ్య, నరసింహారావు, గుగులోతు చంటి, మాడుగుల నాగరాజు, శ్రీనాథ నాగరాజు, కళ్యాణపు నరేష్, దేవరకొండ కిరణ్, మిరియాల కిరణ్, బాలాజీ, సిద్దెల వెంకన్న, పోతురాజు రాములు, కంచర్ల శేఖర్, రాంశెట్టి నాగేశ్వరరావు, యలమద్ది కామేశ్వరావు, గుంటక నర్సింహారావు, శిరంసెట్టి భూపతిరావు తదితరులు పాల్గొన్నారు