మానవ మనుగడకు మొక్కలు జీవనా ధారం.

వీరశైవ సమాజం అద్యక్షులు పటేల్ శ్రీశైలం.
తాండూరు జులై 24(జనంసాక్షి)
మానవ మనుగడకు మొక్కలు జీవనాధారం అని తాండూరు వీరశైవ సమాజం అధ్యక్షులు పటేల్ శ్రీశైలం అన్నారు ఆదివారం పట్టణంలోని
వీరశైవ రుద్ర భూమి లో మొక్కలు నాటే కార్యక్రమాన్ని నిర్వహించారు. కీర్తి శేషులు బీదర్ కంటెప్ప జ్ఞాపకార్థం తన కుమారుడు బీదర్ రాజశేఖర్ వీర శైవ సమాజానికి తన వంతు గా మొక్కలను విరాళంగా అందజేశారు. దీంతో సమాజ సభ్యులు కలిసి వీర శైవ రుద్ర భూమిలో మొక్కలు నాటారు.ఈ సందర్భంగా వీరశైవ సమాజం అద్యక్షులు పటేల్ శ్రీశైలం మాట్లాడుతూ పర్యావరణ పరిరక్షణకు మొక్కలు దోహదపడతాయని పేర్కొన్నారు.
ఈ కార్యక్రమంలో జి .పరమేశ్వర్ , పటేల్ విజయ్ కుమార్ , ఘనపూర్ శంకర్ , మరియు బీదర్ రాజశేఖర్ తదితరులు పాల్గొన్నారు.