మానుకోటలో పోలీసుల తనిఖీలు

మహబూబాబాద్‌,మే12(జ‌నం సాక్షి): మానుకోట పట్టణంలో విస్తృతంగా తనిఖీలు చేపట్టారు. కరార్డెన్‌ సర్చ్‌ నిర్వహించారు.  జిల్లా ఎస్పీ నంద్యాల కోటిరెడ్డి ఆదేశాల మేరకు బాంబు స్కాడ్‌, డాగ్‌ స్కాడ్‌ బృందాలు విస్తృతంగా తనిఖీలు నిర్వహించాయి. పట్టణంలోని రైల్వేస్టేషన్‌, బస్టాండ్‌తో పాటు నెహ్రు సెంటర్‌లోని తొర్రూర్‌ బస్టాప్‌ వద్ద పోలీసులు క్షుణ్ణంగా తనిఖీలు చేశారు. ప్రయాణికుల వద్ద బ్యాగులను పరిశీలించి.. అనుమానిత వ్యక్తులను అదుపులోకి తీసుకొని విచారించారు.  జిల్లాలో నక్సల్స్‌ కదలికలు ఉన్నట్టు సమాచారం అందడంతోనే పోలీసులు ఈ తనిఖీలు చేసినట్టు