మాన్‌ కాపీయింగ్‌ను ప్రోత్సహిస్తే కఠిన చర్యలు

బోథ్‌: పదోతరగతి సప్లిమెంటరీ పరీక్షలు జరిగే క్రమంలో ఇన్విజిలేటర్లు, కేంద్రం ఇన్‌ఛార్జిలు మాన్‌కాపీయింగ్‌కు ప్రోత్సయిస్తే కఠిన చర్యలు తీసుకుంటామని జిల్లా విద్యాశాఖాదికారి అక్రముల్లా ఖాన్‌ హెచ్చరించారు. మండల కేంద్రంలో బుధవారం బాలికల ఉన్నత పాఠశాలల్లో జరుగుతున్న సప్లిమెంటరీ పరీక్షలను ఆయన పరిశీలించిబాలికల పాఠశాలలో ముగ్గురిని, బాలుర ఉన్నత పాఠశాలలో ముగ్గురిని మాన్‌కాపీయింగ్‌కు పాల్పడుతుండగా పట్టుకున్నారు. ఇన్విజిలేతర్లపై ఆగ్రహం వ్యక్తం చేశారు.