మాన ప్రమాదంలో నలుగురి మృతి

హ్యూస్టన్‌: విమానం టేకాఫ్‌ అవుతున్న సమయంలో ప్రమాదం సంభవించి నలుగురు మృతి చెందారు. హ్యూస్టన్‌లోని ఓ ప్రైవేటు విమానాశ్రయంలో శుక్రవారం సాయంత్రం నాలుగు గంటలకు ఈ ప్రమాదం జరిగింది. ప్రత్యక్ష సాక్షుల కథనం ప్రకారం.. సింగిల్‌ ఇంజిన్‌ పైపర్‌ విమానం టేక్‌ ఆఫ్‌ అయ్యే క్రమంలో విమానాశ్రయం సమీపంలోని నివాసప్రాంతాలవైపు దూసుకుపోయింది. అక్కడ చెట్లకు తగిలి పడిపోవడంతో ఒక్కసారిగా మంటల్లో చిక్కుకుంది. దాంతో విమానంలో ఉన్న నలుగురు అక్కడికక్కడే మృతి చెందారని ఫెడరల్‌ ఏవియేషన్‌ అధికారులు తెలిపారు. సంఘటనకు సంబంధించి విచారణ జరుపుతున్నారు.