మాల యువసేన యూత్ ఆధ్వర్యంలో మహా అన్నదానం

మల్లాపూర్ సెప్టెంబర్ 25 (జనం సాక్షి)
వినాయక నవరాత్రి ఉత్సవాలను పునస్కరించుకొని మల్లాపూర్ మండల కేంద్రంలోని అంబెడ్కర్ మాల యువసేన యూత్ ఆధ్వర్యంలో ప్రతిష్టాపించిన వినాయకుడి మండపం వద్ద సోమవారం మహా అన్నదాన కార్యక్రమం ఘనంగా నిర్వహించారు.వినాయక నవరాత్రుల్లో భాగంగా యూత్ సభ్యులు ప్రత్యేక పూజలు నిర్వహించి,మల్లాపూర్ ఎస్ఐ నవీన్ కుమార్ చేతుల మీదుగా కార్యక్రమాన్ని ప్రారంభించారు. గ్రామ ప్రజలు,వివిధ పార్టీ నాయకులు,ప్రజా ప్రతినిధులు,భక్తులు పెద్ద ఎత్తున కార్యక్రమంలో పాల్గొని విజయవంతం చేశారు.ఈ కార్యక్రమంలో మాల యువసేన యూత్ సభ్యులు మేకల సతీష్, రామ నర్సయ్య,మేకల శేఖర్,జుపకు నర్సయ్య,పులెరి రాము, తాండ్రల నరేష్,ఉయ్యాల నర్సయ్య,రామ లక్ష్మణ్, రామ నవీన్,దేవాల గోపి,వీర రఘు,ఉయ్యాల నరేష్,అచ్చ కిషన్,తోగారి నరేష్,దామెర నరేష్,ఎన్నం రాజేందర్,తేలు రాజేష్,రైన,ప్రశాంత్,విజయ్,ఉయ్యాల లక్ష్మణ్, శ్రావణ్,నవీన్,కళ్యాణ్,రాజు,నాగరాజ్, తదితరులు పాల్గొన్నారు..