మా దేశంలో పెట్టుబడులు పెట్టండి -లండన్‌ మేయర్‌ బొరిన్‌ జాన్సన్‌

 

హైద్రాబాద్‌, నవంబర్‌28(జనంసాక్షి): భారతీయ వ్యాపారవేత్తలు లండన్‌లో పెట్టుబడులను పెట్టాలని అక్కడి మేయర్‌ బొరిన్‌ జాన్సన్‌ పిలుపునిచ్చారు. గచ్చీబౌలీలోని ఇండియన్‌ స్కూల్‌ ఆఫ్‌ బిజినెస్‌ని(ఐఎస్‌బి)ని సందర్శించారు. ఈ సందర్భంగా ఆయన అక్కడి విద్యార్థులతో ముఖాముఖి నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన విద్యార్థులు లండన్‌ గురించి అడిగిన ప్రశ్నలకు సమాధానాలిచ్చారు. ప్రపంచంలోని అతి గొప్పనగరాల్లో లండన్‌ ఒకటన్నారు. హైద్రాబాద్‌లాగే లండన్‌లోనూ వివిధ సంస్కృతుల జీవనం ఉంటుందన్నారు. లండన్‌ పెట్టుబడులకు ఎంతో అనుకూలమైందని, శ్రేయస్కరమైనదన్నారు. భారత వ్యాపారవేత్తలు తమ వాణిజ్యాన్ని లండన్‌లో విస్తరించన్నారు. వివిధ రంగాల్లో పెట్టుబడులు పెట్టి వ్యాపార పరిదిని విస్తరించుకోవచ్చన్నారు.