మా సర్కారు వల్లే గిరిజనులకు గుర్తింపు

` బిర్సాముండాకు ఘనంగా నివాళి అర్పించిన మోడీ
` భోపాల్‌లో జనజాతీయ గౌరవ్‌ దివస్‌లో ప్రసంగం
భోపాల్‌,నవంబరు 15(జనంసాక్షి):చరిత్రలో ఆదివాసీ నేతలకు తగిన గుర్తింపు లభించలేదని ప్రధాని మోడీ అన్నారు. గుజరాత్‌లో తాను రాజకీయ జీవితం ప్రారంభించినప్పటి నుంచి ఈవిషయాన్ని ప్రస్తావిస్తునట్టు  మోడీ తెలిపారు. రైతులపై కాంగ్రెస్‌ పార్టీ మొసలి కన్నీరు కారుస్తోందని విమర్శించారు. కాంగ్రెస్‌ పాలనలో కనీస మద్దతు ధరపై ఎప్పుడు మాట్లాడలేదన్నారు. ఆదివాసీలకు తమ ప్రభుత్వం అన్నివిధాలా న్యాయం చేస్తుందన్నారు. ఆదివాసీ ప్రాంతాలను తమ ప్రభుత్వం అన్నివిధాలా అభివృద్ది చేస్తుందని చెప్పారు. ఆదివాసీలకు తమ ప్రభుత్వం అన్నివిధాలా అండగా ఉంటుందని భరోసా ఇచ్చారు. బిర్సా ముండా జయంతి సందర్భంగా భోపాల్‌లో జన జాతీయ గౌరవ్‌ దివస్‌ వేడుకలకు ప్రధాని మోడీ హాజరయ్యారు. ఆదివాసీల ఆరాధ్యదైవం బిర్సా ముండా జయంతి వేడుకల్లో ప్రధాని మోడీ పాల్గొన్నారు.  మధ్యప్రదేశ్‌ రాజధాని భోపాల్‌లో ఈ సందర్భంగా పలు కార్యక్రమాలను ప్రధాని ప్రారంభించారు. జనజాతీయ గౌరవ్‌ దివస్‌ పేరుతో కేంద్రం బిర్సా ముండా జయంతి వేడుకలను నిర్వహిస్తోంది. రాణి కమలాపతి వరల్డ్‌ క్లాస్‌ రైల్వే స్టేషన్‌ను కూడా ప్రారంభించారు. ఎయిర్‌పోర్ట్‌లో ఉండే వసతులన్నీ ఈ రైల్వేస్టేషన్‌లో ఉండేలా తీర్చిదిద్దారు. 50 ఏకలవ్య మోడల్‌ రెసిడెన్షియల్‌ స్కూళ్లను కూడా ప్రారంభించారు. రేషన్‌ ఆప్‌ కే గ్రామ్‌.. ఇంటి దగ్గరకే రేషన్‌ కార్యక్రమాన్ని ప్రారంభించారు. అంతకు ముందు జార్ఖండ్‌ రాజధాని రాంచిలో ఏర్పాటు చేసిన బిర్సా ముండా ట్రైబల్‌ మ్యూజియాన్ని వర్చువల్‌గా ప్రారంభించారు మోడీ. జార్ఱండ్‌ ప్రజలకు ఆయన శుభాకాంక్షలు తెలిపారు. గత ప్రభుత్వాలు ఆదివాసీలను చిన్నచూపు చూశాయని విమర్శించారు. గిరిజనుల సంక్షేమాన్ని కాంగ్రెస్‌ నిర్లక్ష్యం చేస్తూ వచ్చిందని ప్రధాని నరేంద్ర మోదీ అన్నారు. గత పాలకుల హయాంలో వెనుకబడిన ప్రాంతాలుగా మిగిలిపోయిన వాటిని అభివృద్ధి చేసేందుకు ప్రయత్నాలు జరుగుతున్నాయని చెప్పారు. గిరిజనుల ఆరాధ్య దైవమైన బిర్సా ముండా జయంతి అయిన నవంబర్‌ 15వ తేదీని ఇకనుంచి ’జన్‌జాతీయ గౌరవ్‌ దివస్‌’గా కేంద్రం నిర్వహిస్తున్నట్టు ప్రధాని నరేంద్ర మోదీ ప్రకటించారు. అంబేద్కర్‌ జయంతి, గాంధీ జయంతి తరహాలోనే భగవాన్‌ బిర్సా ముండా జయంతిని ఏటా నవంబర్‌ 15న నిర్వహిస్తామని అన్నారు. స్వాంతంత్యర్ర వచ్చిన తర్వాత జరుపుతున్న తొలి ’జన్‌జాతీయ గౌరవ్‌ దివస్‌’ ఇదని పేర్కొన్నారు. గిరిజనులను గత ప్రభుత్వాలు నిర్లక్ష్యం చేశాయి. కనీన సౌకర్యాలకు కూడా వారు నోచుకోలేదు. గత ప్రభుత్వ (కాంగ్రెస్‌) హయాలంలో వెనుకబడిన ప్రాంతాలకు గానే మిగిలిపోయిన 100 జిల్లాల్లో ఇప్పుడు అభివృద్ధి పట్టాలెక్కుతోందని ప్రధాని ఈ సందర్భంగా అన్నారు. స్వాంతంత్య వచ్చిన తర్వాత జరుపుతున్న తొలి జన్‌జాతీయ గౌరవ దివస్‌ ఇదని చెప్పారు. స్వాతంత్య పోరాటం, జాతి నిర్మాణంలో గిరజన కళలు, సంస్కృతి, వారి సేవలు ప్రశంసనీయమని. గోండుల రాణి దుర్గవతి సాహసం కానీ, రాణి కమలాపతి త్యాగం కానీ దేశం ఎప్పటికీ మరిచిపోదని అన్నారు. సాహసవంతులైన భిల్ల జాతి గిరిజనులు లేకుండా వీర మహారాణా ప్రతాప్‌ పోరాటం ఊహించడం కూడా సాధ్యం కాదని అన్నారు. గత ప్రభుత్వాలు గిరిజన ప్రముఖులను, వారి సేవలను నిర్లక్ష్యం చేసిందని, గిరిజన సమాజం సేవలను దేశానికి చెప్పలేదని, పరిమిత సమాచారం మాత్రమే ఇచ్చిందని విమర్శించారు. జన్‌జాతీయ గౌరవ్‌ దివస్‌ మహాసమ్మేళనంలో  మధ్యప్రదేశ్‌ ముఖ్యమంత్రి శివరాజ్‌ సింగ్‌ చౌహాన్‌ పాల్గొన్నారు. పెద్దఎత్తున ప్రజానీకం హాజరయ్యారు.