మిలాద్-ఉన్-నబీ సందర్భంగా ఎమ్మెల్యే నరేందర్ అన్నదాన కార్యక్రమం

వరంగల్ ఈస్ట్, సెప్టెంబర్ 28 (జనం సాక్షి)

శంభునిపేట జంక్షన్ లో ఎమ్మెల్యే నన్నపునేని నరేందర్ ఆధ్వర్యంలో నిర్వహించిన మహా అన్నదాన కార్యక్రమానికి పాల్గొన్నారు
ఈ సందర్భంగా ఎమ్మెల్యే నరేందర్ మిలాద్ ఉన్ నబీ పండుగను పురస్కరించుకుని
ముస్లింలకు శుభాకాంక్షలు తెలిపారు
మహమ్మద్ ప్రవక్త బోధనలైన శాంతి, కరుణ, ధార్మిక చింతన, దాతృత్వం, ఐకమత్యం, సర్వ మానవ సమానత్వం ప్రపంచమంతా వెల్లివిరియాలని ఎమ్మెల్యే ఆకాంక్షించారు.
తదనంతరం తవక్కల్ వెళ్ఫెర్ సొసైటీ జబ్బార్ ఆధ్వర్యంలో ఎమ్మెల్యే నన్నపునేని ముస్లిం సోదరీమణులకు వస్త్రాలను అందించారు.
తదనంతరం శంభునిపేట వాస్తవ్యులు అమీర్ పాషా ఆధ్వర్యంలో నిర్వహించిన రక్తదాన శిబిరానికి హాజరై రక్తదానం చేసిన ప్రతిఒక్కరిని అభినందించి సర్టిఫికెట్స్ అందజేశారు కార్యక్రమంలో కార్పొరేటర్ పోశాల పద్మ స్వామి గౌడ్, మోడెం ప్రవీణ్,హైమత్,జబ్బార్, ఎండి వహీద్ ,సలావోద్దీన్,ఫీరోజ్,ముక్తార్ మాలిక్,సల్మాన్ హాజరయ్యారు.