ముఖ్యమంత్రి సహాయనిది చెక్కులు పంపిణీ చేసిన ఎమ్మెల్యే గణేష్

 

 

 

 

నర్సీపట్నం ఫిబ్రవరి 15 (జనంసాక్షి) :

 

నర్సీపట్నం నియోజకవర్గంలో నాలుగు మండలాల్లో గల సుమారు పది మంది లబ్ధిదారులకు ముఖ్యమంత్రి సహాయనిధి ద్వారా వివిధ రకాలుగా అనారోగ్యం పాలై మెరుగైన చికిత్స చేయించుకున్న లబ్ధిదారులకు 5 లక్షల రూపాయలు విలువగల చెక్కులులను ఎమ్మెల్యే పెట్ల ఉమా శంకర్ గణేష్ తన క్యాంపు కార్యాలయంలో పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే ఉమాశంకర్ గణేష్ గ మాట్లాడుతూ నియోజకవర్గంలో ఇప్పటికే అనేక మందికి ఆరోగ్యశ్రీ ద్వారా లబ్ధి పొందుతున్న అప్పటికీ కొన్ని వ్యాధులు ఆరోగ్యశ్రీ లో వైద్యం అందక పోవడంతో వారికి ముఖ్యమంత్రి సహాయ నిధి ద్వారా ఆర్థిక సహాయం అందిస్తున్నామని తెలిపారు . ఈ పంపిణీ కార్యక్రమంలో నర్సీపట్నం ఎంపీపీ రాజేశ్వరి, పట్టణ వైసీపీ పార్టీ అధ్యక్షులు, కౌన్సిలర్ కోనేటి రామకృష్ణ మాకవరపాలెం ఎంపీపీ సత్యనారాయణ , పార్టీ అధ్యక్షులు వాసు, నాతవరం అంకమ రెడ్డి జమీలు, నూకరాజు, పైల సునీల్, గొలుగొండ ఎంపీపీ మణికుమారి, జడ్పిటిసి గిరిబాబు, కేడి పేట ఎంపిటిసి బుల్లి ప్రసాదు, తదితరులు పాల్గొన్నారు.