ముగిసిన ఆర్మీ రిక్రూట్‌మెంట్ ర్యాలీ

హన్మకొండ: వరంగల్ జిల్లాలో పది రోజుల పాటు జరిగిన ఆర్మీ రిక్రూట్‌మెంట్ ర్యాలీ శనివారం ఉదయం ముగిసింది. దాదాపు 30 వేల మంది దరఖాస్తు చేసుకోగా ఆర్మీ రిక్రూట్‌మెంట్ ర్యాలీలో 15 వేల మంది పాల్గొన్నారు. వీరందరికీ పరుగు పందెం పోటీలు నిర్వహించారు. దాదాపు 3 వేల మందిని ఎంపికచేసినట్లు ఆర్మీ రిక్రూట్‌మెంట్ డెరెక్టర్ రోహిల్లా నేటి ఉదయం జరిగిన మీడియా సమావేశంలో తెలిపారు.