మునుగోడు ఉపఎన్నికల్లో టిఆర్ఎస్ పార్టీ అభ్యర్థి కూసుకుంట్ల ప్రభాకర్ రెడ్డి గెలుపు ఖాయం

రంగారెడ్డి జిల్లా రైతు బంధు సమితి అధ్యక్షుడు వంగేటి లక్ష్మారెడ్డి

రంగారెడ్డి/ఇబ్రహీంపట్నం,(జనంసాక్షి):-మునుగోడు ఉపఎన్నికల్లో టిఆర్ఎస్ పార్టీ అభ్యర్థి కూసుకుంట్ల ప్రభాకర్ రెడ్డి గెలుపు ఖాయమని రంగారెడ్డి జిల్లా రైతు బంధు సమితి అధ్యక్షుడు వంగేటి లక్ష్మారెడ్డి అన్నారు. మంగళవారం ఆయన మునుగోడు ఉప ఎన్నికల ప్రచారంలో ఇబ్రహీంపట్నం ఎమ్మెల్యే మంచిరెడ్డి కిషన్ రెడ్డి, డీసీసీబీ వైస్ చైర్మన్ కొత్త కుర్మా సత్తయ్య, రగన్నగూడా మాజీ సర్పంచ్ కందాడి లక్ష్మారెడ్డి, రైతు సేవా సహకార సంఘం డైరెక్టర్ సామ సంజీవ రెడ్డిలతో కలిసి మునుగోడు టిఆర్ఎస్ పార్టీ అభ్యర్థి కూసుకుంట్ల ప్రభాకర్ రెడ్డి తరుపున ఇంటింటి ప్రచారం నిర్వహించారు. అనంతరం ఏర్పాటు చేసిన సభలో మాట్లాడుతూ మునుగోడు లో టీఆర్ఎస్ పార్టీ గెలుపు ఖాయమని అన్నారు.  సీఎం కేసీఆర్ నాయకత్వం లో రాష్ట్రం అభివృద్ధి పథంలో దూసుకుపోతుందని తెలిపారు. దేశ రాజకీయాల్లో సైతం సీఎం కేసీఆర్ కి ఎదురులేదని అన్నారు.