ముస్లింలంతా భారత్ మాతాకీ జై అనాల్సిందే: షియా వక్ఫ్ ఆదేశాలు
లక్నో,ఆగస్ట్13(జనం సాక్షి): స్వాతంత్య్ర దినోత్సవం పురస్కరించుకొని..ఆగస్టు 15న ప్రతి ముస్లిం వ్యక్తి భారత్ మాతాకీ జై అని నినదించాలని ఉత్తరప్రదేశ్ షియా వక్ఫ్ బోర్డు ఆదేశాలు జారీ చేసింది. ఈ సందర్భంగా షియా వక్ఫ్ బోర్డు చైర్మన్ వసీం రిజ్వి మాట్లాడుతూ.. స్వాతంత్య్ర దినోత్సవం రోజున జాతీయ గీతం ఆలపించిన తర్వాత ప్రతి ముస్లిం వ్యక్తి భారత్ మాతాకీ జై అని నినదించాలి. ఇది తప్పనిసరి. భారత్ మాతాకీ జై అని నినదించని వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని ఆయన హెచ్చరించారు. ఆగస్టు 15న 72వ స్వాతంత్య దినోత్సవ వేడుకలు జరుపుకోనున్నాం.