మృగాళ్ల అత్యాచార బీభత్సం

8నెలల గర్భిణిపై సామూహిక అత్యాచారం

భర్తను కట్టిపడేసి దారుణానికి ఒడిగట్టిన దుర్మార్గులు

ముంబయి,ఆగస్ట్‌3(జ‌నం సాక్షి): అత్యాచార ఘటనల్లో  దారుణమైన ఓ అమానుష ఘటన ఇది. గర్భిణి అని కూడా చూడకుండా ఓ మహిళపై మృగాళ్లు రాక్షసకాండకు దిగారు. అత్యంత హృదయవిదారక ఘటన మహారాష్ట్రలో జరిగింది. కామంతో కళ్లు మూసుకుపోయిన మృగాళ్లు ఎనిమిది నెలల గర్భిణి అనే కనికరం లేకుండా ఓ మహిళ(20)పై 8 మంది సామూహిక అత్యాచారానికి ఒడిగట్టారు. ఈ దారుణ ఘటన మహారాష్ట్రలోని సాంగ్లీలో జరిగింది. బాధితురాలి భర్తను విచక్షణరహితంగా కొట్టి, కారులో కట్టేసి నిందితులు ఈ దారుణానికి పాల్పడ్డారు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం సతారా జిల్లా కేంద్రలో బాధిత దంపతులు ఓ ¬టల్‌ నిర్వహిస్తున్నారు. అయితే, వారికి ¬టల్‌ లో పనిచేసేందుకు ఇద్దరు వ్యక్తుల అవసవరం ఉంది. ఈ క్రమంలో ముకుంద్‌ మానే అనే వ్యక్తి ఆ దంపతులను కలిసి తనకు తెలిసిన వారికి పని కావాలని, వారికి రూ. 20వేల నగదు అవసరం ఉందని, అది విూరు వారికి సర్దుబాటు చేస్తే పనిలో పెట్టుకోవచ్చని నమ్మబలికాడు. దాంతో దంపతులు ముకుంద్‌ మాటలు నమ్మి ఇరవై వేలు తీసుకుని అతని వెంట తుర్చిఫాటా అనే ప్రాంతానికి వెళ్లారు. అప్పటికే అక్కడే ఉన్న తన ఏడుగురు స్నేహితులతో కలిసి ముకుంద్‌ ¬టల్‌ యజమానిపై విచక్షణరహితంగా దాడి చేసి కారులో కట్టిపడేశారు. అనంతరం అతడి భార్యపై 8 మంది గ్యాంగ్‌ రేప్‌ చేశారు. ఆ తరువాత దంపతుల వద్ద ఉన్న నగదు, ఆభరణాలు దోచుకుని వారిని బెదిరించి అక్కడి నుంచి పరారయ్యారు. కొద్దిసేపటి తర్వాత బాధిత దంపతులు సవిూపంలోని పోలీస్‌ స్టేషన్‌ కు వెళ్లి ఫిర్యాదు చేశారు. పోలీసులు కేసు నమోదు చేసుకుని నిందితుల కోసం గాలింపు చర్యలు చేపట్టారు. బాధితురాలిని ఆస్పత్రికి తరలించారు.