మృతుల కుటుంబాలకు భరోసా నిచ్చిన వంగూర్ ప్రమోద్ కుమార్ రెడ్డి
మృతుల కుటుంబాలకు భరోసా నిచ్చిన వంగూర్ ప్రమోద్ కుమార్ రెడ్డి
వనపర్తి బ్యూరో సెప్టెంబర్27 (జనంసాక్షి)
వనపర్తి జిల్లా కేంద్రంలో ని
8 వ వార్డు బుడగ జంగాల కాలనీ మహిళా అధ్యక్షురాలి భర్త గగనం వేణయ్యా గుండెపోటుతో మరణించారు. ఈ విషయం తెలుసుకున్న వనపర్తి నియోజకవర్గ ఎన్నికల సమన్వయకర్త వంగూరు ప్రమోద్ రెడ్డి అక్కడికి వెళ్లి పార్థివ దేహానికి పూలమాలవేసి నివాళులర్పించారు. వారి కుటుంబాన్ని పరామర్శించి వారికి ఆర్థిక సహాయం చేసి ఎల్లవేళలా అండగా ఉంటామని మనో ధైర్యాన్ని ఇచ్చారు.
10 వ వార్డ్ నాగవరం నాయి బ్రాహ్మణ కాలనీ చెందిన అశ్విని కేశవులు అనారోగ్యంతో మరణించారు. ఈ విషయం తెలుసుకున్న ఆయన అక్కడికి వెళ్లి పార్థివ దేహానికి పూలమాలవేసి నివాళులర్పించారు. వారి కుటుంబాన్ని పరామర్శించి వారికి ఆర్థిక సహాయం చేసి ఎల్లవేళలా అండగా ఉంటానని మనో ధైర్యాన్ని తెలపడం జరిగింది. అన్నగారితోపాటు 8 వార్డ్ 10 వార్డ్ ల బీఆర్ఎస్ నాయకులు , తదితరులు పాల్గొన్నారు.