మెడికల్‌ సీట్ల విషయంలో ప్రభుత్వ తీరును తప్పుబట్టిన భాజపా

హైదరాబాద్‌:మెడికల్‌ సీట్ల విషయంలో రాష్ట్ర ప్రభుత్వ తీరు ఆక్షేపణీయంగా ఉందని బీజేపి మండిపడింది.ప్రభుత్వ వైద్య కళాశాలల్లో మౌలిక సదుపాయాలు ఎంతో మెరుగ్గా ఉన్నప్పటికీ ఎక్కువ సీట్లను పొందడంలో ప్రభుత్వం విఫలమైందని భాజపా సీనియర్‌ నేత ఇంద్రసేనారెడ్డి ఆరోపించారు.ప్రైవేటు కళాశాలల్లో మేనేజ్‌మెంట్‌ కోటాలో ఒకటో రెండో సీట్లను దండుకోవడానికి నేతలు చూస్తున్నారని తీవ్రంగా విమర్శించారు.పేద విద్యార్థులకు మేలు జురిగేలా ఆన్‌లైన్‌ పద్దతిలో కౌన్సెలింగ్‌ నిర్వహించాలని ఆయన ప్రభుత్వాన్ని డిమాండ్‌ చేశారు.