మెదక్ నియోజకవర్గం లో ఎమ్మెల్యే యం.పద్మా దేవేందర్ రెడ్డి పర్యటన …

మెదక్ ప్రతినిధి,(జనంసాక్షి):మెదక్ నియోజకవర్గం పర్యటన వివరాలు..ఉదయం 10:00 గంటలకు హవేళిఘనాపూర్ మండలం రాజ్ పేట్ గ్రామంలో ఇండియన్ గ్యాస్ ఏజెన్సీని ప్రారంభిస్తారు, ఉదయం 11:00 గంటలకు వాడి గ్రామంలో దూప్ సింగ్ తాండకు చెందిన రైతులకు జంతు నష్టపరిహారం చెక్కులను అందజేస్తారు,మధ్యాహ్నం 12:30 నిమిషాలకు రామాయంపేట ఎంపీడీఓ కార్యాలయంలో కళ్యాణ లక్ష్మి చెక్కులను లబ్ధిదారులకు అందజేయనున్నారు,మధ్యాహ్నం 2:00 గంటలకు పాపన్నపేట ఎంపీడీఓ కార్యాలయంలో కల్యాణ లక్ష్మి చెక్కులను లబ్ధిదారులకు అందజేయనున్నారు,మధ్యాహ్నం 3:00 గంటలకు మెదక్ జిల్లా పరిషత్ కార్యాలయంలో స్టాండింగ్ కమిటీ సమావేశంలో పాల్గొంటారు.