మైనార్టీ రెసిడెన్షియ‌ల్ స్కూల్ ను సంద‌ర్శించిన మంత్రి ఇంద్ర‌క‌రణ్ రెడ్డి

నిర్మ‌ల్ బ్యూరో, జులై 22: జనంసాక్షి,,, నిర్మల్ జిల్లా కేంద్రంలో ని  క‌స్భా మైనారిటీ బాలికల గురుకుల పాఠశాలను మంత్రి అల్లోల ఇంద్ర‌క‌ర‌ణ్ రెడ్డి శుక్రవారం సందర్శించారు.  వ‌ర్షాల వ‌ల్ల పాఠ‌శాల ప్రాంగ‌ణంలో  నీరు నిల‌వ‌డం,  లీకేజీల  వ‌ల్ల త‌ర‌గ‌తి గ‌దుల్లో నీరు నిల‌వ‌డాన్ని గ‌మనించిన మంత్రి… వెంట‌నే  అక్క‌డ నుంచే సంబంధిత అధికారుల‌కు ఫోన్ చేసి  మ‌ర‌మ్మ‌త్తులు చేప‌ట్టాల‌ని ఆదేశించారు. వర్షాల వలన విద్యార్థులకు తలెత్తిన సమస్యలు గురించి అడిగి తెలుసుకున్నారు. అనంత‌రం వంట‌గ‌దిని, వంట‌కాల‌ను, వంట సామానుల‌ను ప‌రిశీలించారు.  విద్యార్థినిల‌తో  ముచ్చ‌టించి… విద్యా  బోధ‌న‌, క‌నీస వ‌స‌తుల గురించి అడిగి తెలుసుకున్నారు. విదార్థినుల‌కు నాణ్య‌మైన, తాజా ఆహారాన్ని అందించాల‌న్నారు. ఏమైనా సమస్యలు ఉంటే తమ దృష్టికి తీసుకురావాలని సూచించారు.ఈకార్యక్రమంలో తెరాస నాయకులు కౌన్సిలర్లు అయ్యన్నగారి రాజేందర్ ,ధర్మాజి రాజేందర్, తదితరులు పాల్గొన్నారు