మోడీకి మనవరాలు వివాహాహ్వానం అందించిన రాయపాటి

న్యూఢిల్లీ,ఆగస్ట్‌3(జ‌నం సాక్షి): ప్రధాని నరేంద్ర మోడీతో టిడిపి ఎంపి రాయపాటి సాంబశివరావు సమావేశమయ్యారు. మోడీని కలవడంలో ఎలాంటి రాజకీయ కారణాలు లేవని రాయపాటి విలేకరులకు చెప్పారు. తన మనుమరాలి వివాహ పత్రికను మోడీకి ఇచ్చి, ఆహ్వానించానని ఆయన అన్నారు. నియోజక వర్గ సమస్యలను ప్రధానికి వివరించానని, వాటర్‌ గ్రిడ్‌ ప్రాజెక్టుకు నిధులు ఇవ్వాలని కోరారని ఆయన అన్నారు.