మోడీకి లబ్ది చేకూర్చేందుకే ఫ్రంట్‌ రాగం

కెసిఆర్‌పై నారాయణ ధ్వజం
వరంగల్‌,మే9(జ‌నం సాక్షి):  ప్రధానమంత్రి నరేంద్ర మోదీకి లబ్ది చేకూర్చేందుకే తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్‌ ఫ్రంట్‌ నినాదం చేస్తున్నారని సీపీఐ జాతీయ నేత నారాయణ దుయ్యబట్టారు. మోడీ మార్గంలో కెసిఆర్‌ నడుస్తున్నారని అన్నారు.  పోచమ్మమైదానంలో చెన్నబోయిన కమలమ్మ, అప్పన్న విగ్రహాలను చాడ వెంకట్‌ రెడ్డి, మాజీ మంత్రి సారయ్యలతో కలిసి ఆయన ఆవిష్కరించారు. ఈ సందర్భాంగా ఆయన మాట్లాడుతూ చంద్రబాబు ఓటుకు నోటు కంటే కేసీఆర్‌ టెలిపోన్‌ ట్యాపింగ్‌ కేసు ప్రమాదమైనదని అన్నారు. మోదీ ప్రభుత్వం ఆర్థిక నేరగాళ్ళకు అండగా ఉంటుందని నారాయణ విమర్శించారు. వీరి వ్యతిరేకులను కూడగట్టి రాష్ట్రంలో పోరాటం సాగిస్తామని అన్నారు. తెలంగాణ ఆకాంక్షలకు భని/-నంగా కెసిఆర్‌ పాలన సాగుతోందని చాడ వెంకట్‌ రెడ /-డి అన్నారు. ఇంతకన్నా దౌర్భాగ్యం మరోటి ఉండబోదన్నారు.