మోడీతో పవన్‌,జగన్‌ కుమ్మక్కు: మంత్రి ప్రత్తిపాటి

 

విజయవాడ,నవంబర్‌24(జ‌నంసాక్షి): జగన్‌, పవన్‌లు మోడీతో కుమ్మక్కై రాష్ట్ర అభివృద్ధిని అడ్డుకుంటున్నారని మంత్రి ప్రత్తిపాటి పుల్లారావు ఎద్దేవా చేశారు. కైకలూరు ఎంపి మాగంటి నివాసంలో మంత్రి ప్రత్తిపాటి పుల్లారావు శనివారం విలేకరులతో మాట్లాడుతూ.. ప్రభుత్వం రైతులకు ధాన్యానికి తగిన మద్దతు ధర కల్పించిందన్నారు. 48 గంటల్లో రైతుల ఖాతాల్లో జమ వేస్తుంది చంద్రబాబు ప్రభుత్వమేనని, రానున్న రోజుల్లో మోడీ ప్రభుత్వానికి ప్రజలే బుద్ధి చెబుతారన్నారు. జగన్‌, పవన్‌లు మోడీతో కుమ్మక్కై రాష్ట్ర అభివృద్ధిని అడ్డుకుంటున్నారని విమర్శించారు. 2019 ఎన్నికల్లో చంద్రబాబు నిర్ణయించే ప్రభుత్వం రాబోతోందని ఆశాభావం వ్యక్తం చేశారు. అనంతరం మంత్రి ప్రత్తిపాటి పుల్లారావు కైకలూరు నియోజకవర్గం టిడిపి కార్యాలయంలో ఉన్న నందమూరి తారక రామారావు విగ్రహానికి పూలమాల వేసి నివాళులర్పించారు.