మోడీ విధానాలకు అనుగుణంగానే బాబు విధానాలు

 

మండిపడ్డ లోక్‌సత్తా

విజయనగరం,నవంబర్‌21(జ‌నంసాక్షి): ప్రధాని మోడీ, బిజెపి పార్టీ రాష్ట్రానికి చేస్తున్న అనాయాన్ని ఎదిరిచేందుకు చేపడుతున్న టిడిపి ధర్మ పోరాట దీక్షలు దారి తప్పి టిడిపి ఎన్నికలు ప్రచార సభల్లా మారిపోయాయని లోకసత్తా పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు బిసెట్టి బాబ్జి విమర్శించారు. బుధవారం విజయనగరం పార్టీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ.. రాష్టాన్రికి జరిగిన అనాయ్యంపై ఎదిరించేందుకు అన్ని వర్గాల ప్రజలును, రాజకీయ పార్టీలను, మేధావులు, ఏకం చేసి కేంద్రం పై పోరాటం చేయడంలో రాష్ట్ర ప్రభుత్వం విఫలమైందని ఆరోపించారు. కేంద్రం ప్రధాని మోడీ సారధ్యంలో బిజెపి ఎలాంటి విధానాలు అనుసరిస్తుందో, రాష్ట్రంలో కూడా చంద్రబాబు సారథ్యంలో అవే విధానాలు అనుసరిస్తుందని విమర్శించారు. అలాగే కేంద్రంలో సివిసి, సిబిఐ లాంటి సంస్థలు తమ ఇష్టం వచ్చినట్లు వ్యవరిస్తుందో అలాగే మన రాష్ట్రంలో కూడా పరిపాలనకి సంబంధించి ఇద్దరు మాజీ కార్యదర్శి లు నిరతరం ప్రశ్నిస్తున్న పాలకుల నుండి చలనం లేదు అని ఎద్దేవా చేశారు. అలాగే ధర్మ పోరాట దీక్షకి విజయనగరం వస్తున్న చంద్రబాబు నాయుడు, విజయనగరం జిల్లాకు ఇచ్చిన పది హావిూల్లో ఒక్కటి కూడా నెరవేర్చలేదు అని తెలిపారు. కాబట్టి ఇవ్వన్నీ వదిలేసి ఇక్కడ ధర్మ పోరాట దీక్ష చేయడం కామెడీగా ఉంది అని ఎద్దేవా చేశారు. ఈ సమావేశంలో పార్టీ నాయకులు నాగభూషణం, రాజారావు, గురునాధం, భాస్కర్‌, చంద్రరావు , శ్రీను తదితరులు పాల్గొన్నారు.