మోదీ ఓడిపోతే జైలుకు పోతానని.. జగన్‌ కు భయం పట్టుకుంది

– మోదీపై విమర్శలను జగన్‌ తట్టుకోలేకపోతున్నారు

– ఏపీ ఆర్ధికశాఖ మంత్రి యనమల రామకృష్ణుడు

అమరావతి, నవంబర్‌21(జ‌నంసాక్షి) : మోదీ ఓడిపోతే తాను జైలుకు పోవాల్సి వస్తుందని జగన్‌కు భయం పట్టుందని, దీంతోనే చంద్రబాబు దేశంలోని బీజేపీయేతర పార్టీలను ఏకం చేస్తుంటే ఏపీ ప్రతిపక్ష నేత జగన్‌ తట్టుకోలేకపోతున్నారని మంత్రి యనమల రామకృష్ణుడు విమర్శించారు. బుధవారం ఆయన విలేకరుల సమావేశంలో మాట్లాడారు.. బీజేపీపై తెలుగుదేశం పోరాడుతుంటే జగన్‌కు బాధగా ఉందని వ్యాఖ్యానించారు. చంద్రబాబుపై ప్రజాసంకల్పయాత్రలో భాగంగా జగన్‌ చేసిన విమర్శలను యనమల ఖండించారు. మోదీ ఓడిపోతే జైలుకు పోతానని జగన్‌ కు భయం పట్టుకుందని యనమల ఆరోపించారు. అందుకే ఆయన కోడికత్తి నాటకాలు చేస్తున్నారని దుయ్యబట్టారు. రాబోయే ఎన్నికల్లో రాష్ట్ర ప్రజలు మరోసారి టీడీపీకి పట్టం కడతారని ధీమా వ్యక్తం చేశారు. దేశంలోని అన్ని వ్యవస్థలను ప్రధాని మోదీ నిర్వీర్యం చేశారని మండిపడ్డారు. అందువల్లే ఇప్పుడు సీబీఐలో అంతర్గత కుమ్ములాటలు చోటుచేసుకుంటున్నారని పేర్కొన్నారు. రాష్ట్రానికి ప్రత్యేక ¬దా ఇస్తా, ప్యాకేజీ ఇస్తామని చెప్పిన బీజేపీ ప్రభుత్వం నాలుగేళ్ల పాటు ¬దా ఇవ్వకుండా ఇబ్బందులకు గురిచేసిందన్నారు. ప్యాకేజీకిసైతం ఒప్పుకున్నా అదికూడా నెరవేర్చలేదన్నారు. దీంతో తాము ఏపీ ప్రయోజనాల కోసమే బీజేపీతో తెగదెంపులు చేసుకున్నామని అన్నారు. ఏపీపై కక్షపూరితంగా వ్యవహరించే బీజేపీని గద్దెదించేందుకు ప్రజలంతా ఏకం కావాలని అన్నారు. వచ్చే ఎన్నికల్లో మళ్లీ తెదేపా అధికారంలోకి వస్తేనే ఏపీ అన్ని రంగాల్లో అభివృద్ధిచెందుతుందని అన్నారు.