మోదీ లేకుంటే చంద్రబాబు జీరో

– కడప నుంచే ఎన్నికల ప్రచారం ప్రారంభిస్తాం

– బీజేపీ ఎమ్మెల్సీ సోమువీర్రాజు

కడప, జనవరి18(జ‌నంసాక్షి) : రానున్న ఎన్నికల్లో ఏపీ సీఎం చంద్రబాబు నాయుడికి ప్రజలే బుద్ధిచెబుతారని బీజేపీ నేత, మండలి సభ్యుడు సోము వీర్రాజు అన్నారు. శుక్రవారం ఆయన కడపలో జరిగిన విలేకరుల సమావేశంలో మాట్లాడారు.. చంద్రబాబును ఇంటికి పంపేందుకు ప్రజలు సిద్ధమైయారని, ప్రధాని నరేంద్ర మోదీ చేసిన అభివృద్ధిని టీడీపీ ప్రభుత్వం విమర్శించడం సిగ్గుచేటని వ్యాఖ్యానించారు. ఏపీ ఎన్నికల ప్రచారాన్ని కేంద్ర ¬ంమంత్రి రాజ్‌నాథ్‌ సింగ్‌ త్వరలోనే కడప నుంచి ప్రారంభిస్తారని వెల్లడించారు.

నాలుగేళ్ల పాలనలో చంద్రబాబు నాయుడు రూ.ఆరు లక్షల కోట్లు దోచుకున్నారని వీర్రాజు ఆరోపించారు. పేదలకు ఇళ్లు కట్టాలని కేంద్ర ప్రభుత్వం నిధులిస్తే టీడీపీ ప్రభుత్వం ఒక్క ఇళ్లు కూడా కట్టలేదన్నారు. చంద్రబాబు అవినీతికి హద్దులు లేవని తీవ్రంగా మండిపడ్డారు. ఏపీ అభివృద్ధిలో మోదీ సహాయం లేకపోతే చంద్రబాబు జీరో అని వ్యాఖ్యానించారు. రాష్ట్రానికి కేంద్రం నిధులు కేటాయిస్తుంటే చంద్రబాబు కావాలని అడ్డుకుంటున్నాడని, తద్వారా కేంద్రంపై విషప్రచారం చేసి వచ్చే ఎన్నికల్లో సానుభూతితో గెలిచేందుకు చంద్రబాబు కుట్ర చేస్తున్నారని సోమువీర్రాజు మండిపడ్డారు. చంద్రబాబు పచ్చి అవకాశవాది అని, ఆయన అవసరాల కోసం రాజకీయంగా ఎంతటికైనా తెగిస్తాడని విమర్శించారు. టీడీపీ సిద్ధాంతాలకు వ్యతిరేఖంగా కాంగ్రెస్‌తో పొత్తుపెట్టుకొని ఎన్టీఆర్‌ పరువు తీశారని విమర్శించారు. కేవలం డబ్బాలు కొట్టుకోవటం తప్ప చంద్రబాబు చేసిన అభివృద్ధి ఏవిూ లేదని విమర్శించారు. చంద్రబాబు కుట్ర, సానుభూతి రాజకీయాలను ప్రజలు గమనిస్తున్నారని వచ్చే ఎన్నికల్లో తగిన గుణపాఠం చెబుతారని హెచ్చరించారు.