యశ్‌చోప్రాకు అంతిమ వీడ్కోలు

ముంబాయి: హింది చిత్ర ప్రముఖులు, రాజకీయ నేతలు సోమవారం దివంగత దర్శక నిర్మాత యాష్‌చోప్రాకు నివాళి అర్పించారు. చోప్రా(80) లీలావతి ఆస్పత్రిలో చికిత్స పొందుతూ ఆదివారం కన్నుమూశారు. ఆయన భౌతికాయాన్ని యష్‌రాజ్‌ స్టూడియోస్‌కు తరలించి అంత్యక్రియలు నిర్వహించారు. కుమారులు ఆదిత్య, ఉదయ్‌, నటి రాణి ముఖర్జి చెమ్మగిల్లిన నేత్రాలతో అక్కడ నిలబడ్డారు. కడసారి చూపునకు పలువురు రావటంతో వారిని అదుపు చేయటం పోలీసులకు కష్టమైంది. చోప్రా మరణ వార్త దిగ్భ్రాంతి కలిగించిందని నిర్మాత రమేశ్‌సిప్పీ అన్నారు. ఇదే అభిప్రాయాన్ని మరో దర్శకుడు మధుర్‌భండార్కార్‌ వ్యక్తం చేశారు. ఆయనకు నివాళులు అర్పించిన ప్రముఖులలో సూపర్‌స్టార్‌ దిలీప్‌కుమార్‌, సుప్రియా పాఠక్‌, పరిణితి,అమితాబచ్చన్‌,షార్‌ఖ్‌ఖాన్‌, మనోజ్‌కుమార్‌, కాజోల్‌, మహరాష్ట్ర సీఎం పృద్వీరాజ్‌ చౌహన్‌ పలువురు సీని రాజకియ ప్రముకులు ఆయనకు నివాళులు అర్పించారు.