యువకుడి ఆత్మహత్యాయత్నం

విజయవాడ,జనవరి3(జ‌నంసాక్షి): కృష్ణా జిల్లా పాయకాపురంలో ఓ యువకుడు ఆత్మహత్యాయత్నం చేశాడు. గోపినాథ్‌ అనే యువకుడు ఒంటిపై పెట్రోల్‌ పోసుకుని నిప్పంటించుకుని ఆత్మహత్యాయత్నం చేశాడు. సెల్‌ఫోన్‌ చూడొద్దని తండ్రి మందలించడంతో మనస్థాపానికి గురైన గోపినాథ్‌ ఆత్మహత్యాయత్నానికి పాల్పడ్డాడు. తీవ్ర గాయాలపాలైన గోపినాథ్‌ను వెంటనే ఆస్పత్రికి తరలించారు.