యువజన కాంగ్రెస్ ఆద్వర్యంలో యంగ్ ఇండియా బోల్ కార్యక్రమం.

నాగర్ కర్నూల్ జిల్లా ప్రతినిధి,అక్టోబర్1 (జనంసాక్షి):
జాతీయ యువజన కాంగ్రెస్ ఆదేశాల మేరకు కాంగ్రెస్ పార్టీ కౌన్సిలర్ నిజాం, యువజన కాంగ్రెస్ నాయకులు కొనిదెల రాము, అహ్మద్ పాషా ఆద్వర్యంలో
నాగర్ కర్నూల్ జిల్లా కేంద్రంలోని మాజీ మంత్రి డాక్టర్ నాగం జనార్దన్ రెడ్డి నివాసంలో యంగ్ ఇండియా బోల్ కార్యక్రమం నిర్వహించారు.ఈ కార్యక్రమాని కి ముఖ్య అతిథిగా యువజన కాంగ్రెస్ రాష్ట్ర అధికార ప్రతినిధి శత్రునాయక్ విష్ణువర్ధన్ రెడ్డి,కాంగ్రెస్ పార్టీ జిల్లా ప్రధాన కార్యదర్శి అర్థం రవి హాజరయ్యారు.ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ
గ్రామాల్లో ఉన్నటువంటి మేధావి వర్గాన్ని మరియు యువతను వెలికి తీయడంలో కాంగ్రెస్ పార్టీ ప్రతిష్టాత్మకంగా తీసుకుందని అన్నారు. కావున గ్రామాల్లో ఉన్నటువంటి యువతను చైతన్యం పరిచేందుకు,ప్రజలను చైతన్య పరిచేందుకు ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నట్లు తెలిపారు.ఈ కార్యక్రమంలో నాగర్ కర్నూల్ కాంగ్రెస్ మున్సిపాలిటీ అధ్యక్షుడు తిమ్మాజీపేట్ పాండు, జిల్లా వైస్ ప్రెసిడెంట్ రేనయ్య అచ్చంపేట అసెంబ్లీ వర్కింగ్ ప్రెసిడెంట్ ఖాదర్ మల్లికార్జున్ పెంట్లవెల్లి యూత్ కాంగ్రెస్ మండల ప్రెసిడెంట్ నరసింహ చెన్నకేశవులు పాల్గొన్నారు.