యువత మహాత్ముని ఆదర్శంగా తీసుకోవాలి

మక్తల్ అక్టోబర్ 02: (జనంసాక్షి) జాతిపిత మహాత్మాగాంధీ జయంతి సందర్భంగా మక్తల్ నియోజకవర్గ కేంద్రంలో వాసవి కన్యకాపరమేశ్వరి ఆలయం దగ్గర జయంతి కార్యక్రమం కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా మక్తల్ నియోజకవర్గ నాయకులు, నారాయణపేట జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు వాకిటి శ్రీహరి హాజరయ్యారు. అనంతరం గాంధీ విగ్రహానికి పూలమాలవేసి ఘన నివాళులర్పించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ప్రపంచానికి గాంధీజీ అహింస మార్గం తోనే దేశానికి స్వాతంత్రం సాధించామని అన్నారు. నేటితరం మహాత్ముని ఆదర్శంగా తీసుకొని ముందుకు సాగినప్పుడు దేశం స్వరోన్నతి చేందుతుందన్నారు. ఈ కార్యక్రమంలో బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షులు బి నర్సింహులు, గణేష్ కుమార్, ఆనంద్ గౌడ్, కట్ట సురేష్, M శ్రీనివాసులు, రవి కుమార్, పెద్దింటి మల్లేష్, జి రవి కుమార్, గోవర్ధన్ తదితరులు పాల్గొన్నారు