యువ జనత ఫౌండేషన్ ఆధ్వర్యంలో ఉచిత విద్యా సామగ్రి పంపిణీ

బజార్ హత్నూర్ ( జనం సాక్షి ) : బజార్ హత్నూర్ మండలంలోని గిరిజన మారుమూల ప్రాంతం అయిన డెడ్రా ప్రాథమిక పాఠశాలలో  యువజన ఫౌండేషన్ యొక్క మొదటి వార్షికోత్సవాన్ని పురస్కరించుకుని కేక్ కట్ చేసి అనంతరం విద్యార్థులకు స్కూల్ బ్యాగులు నోట్ పుస్తకాలు తదితర విద్యా విషయక సామగ్రి పంపిణీ చేపట్టారు ఫౌండేషన్ అధ్యక్షలు బుద్దర్తి నవీన్ సూచనతో ఫౌండేషన్ సభ్యులు ఈ కార్యక్రమాన్ని చేపట్టారు ఇట్టి కార్యక్రమంలో యువ జనత  ఫౌండేషన్ సభ్యులు గాజుల నరేష్ కొడరి శ్రీకాంత్ శేకర్ మధుకర్ శ్రీదర్ ప్రశాంత్ సుధీర్ గ్రామ పటేల్ లింగు సర్పంచ్ భిం రావు గ్రామస్థులు వానర సేన యువజన సంఘం సభ్యులు పాల్గొన్నారు