యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా 104వ వార్షికోత్సవ సంబరాలు

తిరుమలగిరి (సాగర్), నవంబర్ 11 (జనంసాక్షి): మండల కేంద్రంలోని యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా బ్రాంచ్లో 104వ వార్షికోత్సవాన్ని బ్రాంచ్ మేనేజర్ శ్రీనివాసరావు ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ యూనియన్ బ్యాంక్ ఖాతాదారులకు శుభాకాంక్షలు తెలిపారు. మండల కేంద్రంలో ఉన్న యూనియన్ బ్యాంకు లో ఖాతాదారులు రుణ సదుపాయ విషయంలో ఎటువంటి ఇబ్బందులు కలగకుండా నేరుగా తమను సంప్రదించవలసిందిగా కోరారు. ప్రభుత్వ పరంగా అందిస్తున్నటువంటి ఎటువంటి సేవలు అయినా అందరికీ అందుబాటులో ఉంటాయని, ఆయన తెలిపారు. ఈ కార్యక్రమంలో వైస్ ఎంపీపీ ఎడవల్లి దిలీప్ రెడ్డి ,మేనేజర్ ప్రవీణ్ ,ఫీల్డ్ ఆఫీసర్ గజేంద్ర, సంతోష్, జై హింద్ తదితరులు పాల్గొన్నారు