యూపీలో ఘోర రోడ్డు ప్రమాదం

– ఐదుగురు యాత్రికులు దుర్మరణం
లక్నో, ఆగస్టు 4(జ‌నం సాక్షి) : ఉత్తరప్రదేశ్‌లోని జాన్‌పూర్‌లో శనివారం ఉదయం ఘోర రోడ్డు ప్రమాదం సంభవించింది. అలహాబాద్‌లోని కడే మాణిక్‌పూర్‌ ఆలయానికి వెళ్తుండగా ప్రమాదం సంభవించి ఐదుగురు యాత్రికులు దుర్మరణం చెందారు. మరో ఎనిమిది మంది గాయాలపాలయ్యారు. యాత్రికులు వెళ్తున్న బెలోరో వాహనం శనివారం తెల్లవారుజామున జాన్‌పూర్‌-రాయ్‌బరేలీ హైవేపై నికాముద్దీన్‌ గ్రామ సవిూపంలో రోడ్డు పక్కన నిలిపి ఉంచిన మరో వాహనాన్ని ఢీకొట్టడంతో ప్రమాదం జరిగింది.మృతులను మనోజ్‌ పాటిల్‌, జై ప్రకాశ్‌ ఆయన భార్య సరితా దేవి, సుశీల, శర్మిలగా గుర్తించారు. పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని గాయపడిన వారిని ఆస్పత్రికి తరలించారు. ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

 

—————————–