యూరప్‌లోనే కోవిడ్‌ మరణాలు ఎక్కువ


` డబ్ల్యూహెచ్‌వో ఆందోళన
లండన్‌,నవంబరు 17(జనంసాక్షి): ప్రపంచ వ్యాప్తంగా చూస్తే కొవిడ్‌ మరణాలు ఒక్క యూరప్‌లోనే పెరుగుతున్నట్టు ప్రపంచ ఆరోగ్య సంస్థ (చిఊూ) ఆందోళన వ్యక్తంచేసింది. గత వారంలో నమోదైన కొవిడ్‌ మరణాల్లో 5శాతం మేర యూరప్‌ ఖండంలోనే పెరుగుదల కనబడినట్టు వెల్లడిరచింది. అమెరికా, యూరప్‌, ఆసియా ప్రాంతాల్లో పెరుగుదలతో ప్రపంచ వ్యాప్తంగా కరోనా పాజిటివ్‌ కేసులు 6శాతం మేర పెరిగాయని పేర్కొంది. యూరప్‌ మినహా మిగతా అన్ని ప్రాంతాల్లో కొవిడ్‌ మరణాలు స్థిరంగా ఉండటమో, తగ్గడమో జరిగిందని, గతవారంలో ప్రపంచ వ్యాప్తంగా మొత్తం 50వేల మరణాలు సంభవించినట్టు మంగళవారం రాత్రి విడుదల చేసిన వీక్లీ నివేదికలో పేర్కొంది. అలాగే, 3.3 లక్షల కొత్త కేసులు నమోదవ్వగా.. వాటిలో 2.1 మిలియన్‌ కేసులు కేవలం యూరప్‌లోనే వచ్చినట్టు తెలిపింది. జులై నుంచి ఆఫ్రికా, మధ్య ప్రాచ్యం, ఆగ్నేయాసియాల్లో ఇన్ఫెక్షన్లు తగ్గుతున్నాయని ప్రపంచ ఆరోగ్య సంస్థ వెల్లడిరచింది. యూరప్‌లో కొత్త కేసులు ప్రధానంగా రష్యా, జర్మనీ, బ్రిటన్‌లలోనే నమోదవుతున్నాయని తెలిపింది. కొవిడ్‌ మరణాలు నార్వేలో 67శాతానికి పెరగ్గా.. స్లోవేకియాలో 38శాతానికి ఎగబాకినట్టు నివేదికలో పేర్కొంది.పశ్చిమ యూరప్‌లో 60శాతం మంది ప్రజలు పూర్తిగా వ్యాక్సిన్‌ వేయించుకోగా.. తూర్పు ప్రాంతంలో మాత్రం కేవలం సగం మంది మాత్రమే టీకా పొందారు. దీంతో వ్యాక్సిన్‌పై అపోహలు తొలగించడం, పూర్తిస్థాయిలో వ్యాక్సినేషన్‌ నిర్వహించేందుకు అధికారులు శ్రమిస్తున్నారు. కరోనా మహమ్మారికి యూరప్‌ కేంద్రంగా మారిందని, తక్షణ కఠిన చర్యలు చేపట్టకపోతే వచ్చే ఏడాది జనవరి నాటికి మరో ఐదు లక్షల మరణాలు సంభవించే ప్రమాదం ఉన్నట్టు ఇటీవల డబ్ల్యూహెచ్‌వో అధికారులు హెచ్చరించిన విషయం తెలిసిందే. మరోవైపు, కొవిడ్‌ వ్యాప్తిని కట్టడి చేసేందుకు 40 ఏళ్లు పైబడిన వారికి బూస్టర్‌ డోసు అందించాలని యూకే నిర్ణయించగా.. ఆస్ట్రియా, నెదర్లాండ్స్‌ సహా పలు దేశాలు మాత్రం లాక్‌డౌన్‌ తరహాలో కొన్ని చర్యలను మరోసారి అమలుచేయాలని గత వారమే నిర్ణయం తీసుకున్నాయి