యోగా గురు బ్రాండ్‌తో వస్త్రాలు

ట్విట్టర్‌ ద్వారా తెలిపిన బాబా రాందేవ్‌
న్యూఢిల్లీ,సెప్టెంబర్‌27(జ‌నంసాక్షి):  యోగా గురువు బాబా రామ్‌దేవ్‌ త్వరలో వస్త్రవ్యాపారంలోకి ప్రవేశించేందుకు సన్నాహాలు చేస్తున్నారు. అలాగే పతంజలి పరిధాన్‌ పేరిట ఎక్స్‌క్లూజివ్‌ బ్రాండ్‌ అవుట్‌ లెట్‌లను ప్రారంభించనున్నారు. ఈ విషయాలను రామ్‌దేవ్‌ తన ట్వీట్‌ ద్వారా తెలిపారు. దేశంలోని ప్రముఖ పట్టణాలలో పతంజలి పరిధాన్‌ బ్రాండ్‌ అవుట్‌లెట్లను తెరవనున్నారు. వీటిని ఫ్రాంచైజీలకు కేటాయించ నున్నారు. కాగా బాబా రామ్‌దేవ్‌ ఇటీవలే డెయిరీ వ్యాపారాన్నికూడా ప్రారంభించనున్నట్లు తెలిపారు. బాబా రామ్‌దేవ్‌కు చెందిన పతంజలి సంస్థ ఇటీవలే టెలీకాం రంగంలోకి కూడా అడుగుపెట్టింది. ప్రభుత్వ సంస్థ అయిన భారత సంచార్‌ నిగమ్‌ లిమిటెడ్‌ (బీఎస్‌ఎన్‌ఎల్‌)తో జతకట్టింది. ఈ నేపధ్యంలో బాబా స్వదేశీ సమృద్ధి సిమ్‌ కార్డులను విడుదల చేసిన విషయ విదితమే!