రక్తదానం చెయ్యండి ప్రాణాలను కాపాడండి

 బషీరాబాద్ జూలై 24, (జనం సాక్షి) బషీరాబాద్ మండలం కేంద్రంలో కల్వకుంట్ల తారక రామారావు జన్మదినం సందర్భంగా  రక్త దానం మహాదానం రక్తదానం చేయండి ప్రాణాలు కాపాడండి అంటూ స్థానిక ఎమ్మెల్యే పైలట్ రోహిత్ రెడ్డి ఆదేశాల మేరకు ప్రభుత్వ ఆసుపత్రిలో ఏర్పాటు చేసిన రక్త శిబిరానికి ఎస్ఐ అన్వేష్ రెడ్డి చేతుల మీదుగా రిబ్బన్ కట్ చేసి ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో  యువకులు రక్తదానం చేశారు. రక్తదానం చేసిన యువకులను అభినందిస్తూ పత్రాలు అందజేశారు. ఈ కార్యక్రమంలో టిఆర్ఎస్ పార్టీ మండల అధ్యక్షులు రాము నాయక్, వ్యవసాయ మార్కెట్ కమిటీీ చైర్మన్ రాజరత్నం, వైస్ చైర్మన్ రవీందర్ సింగ్,మాజీ ఎంపిటిసి నరేష్ చవన్, టిఆర్ఎస్ నాయకులు సాయిలు గౌడ్, పవన్ ఠాకూర్,రాజన్న,సిద్ధూ,సునీల్, తాహెర్,టిఆర్ఎస్ కార్యకర్తలు,నాయకులు,తదితరులు పాల్గొన్నారు.