రష్యా దాడితో మార్కెట్ల పతనం

భారీగా నష్పోయిన ప్రపంచ మార్కెట్లు
న్యూఢల్లీి,ఫిబ్రవరి24(జనం సాక్షి): ఉక్రెయిన్‌లో రష్యా సైనిక చర్యను చేపట్టిన తర్వాత పెట్టుబడిదారులు జాగ్రత్తగా మారడంతో గురువారం భారతీయ ఈక్విటీ సూచీలు భారీగా పతనమయ్యాయి. నేను సైనిక చర్య నిర్ణయం తీసుకున్నానని రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్‌ పుతిన్‌ అన్నారు. ఉదయం 9:19 గంటల నాటికి, బెంచ్‌మార్క్‌ సెన్సెక్స్‌ 17,00 పాయింట్లు తగ్గి 55,552 వద్దకు చేరుకుంది. నిప్టీ502 పాయింట్లు క్షీణించి 16,551 వద్దకు చేరుకుంది. జపాన్‌ నిక్కీ 2.17 శాతం, దక్షిణ కొరియా కోస్పి 2.66 శాతం, షాంఘై కాంపోజిట్‌ ఇండెక్స్‌ 0.89 శాతం క్షీణించడంతో ఆసియా షేర్‌ మార్కెట్లు కూడా పతనమయ్యాయి. అలాగే, ఉక్రెయిన్‌ సంక్షోభం మధ్య 2014 తర్వాత మొదటిసారి బ్రెంట్‌ చమురు బ్యారెల్‌ 100కి పెరిగింది. నిప్టీ మిడ్‌క్యాప్‌ 100 ఇండెక్స్‌ 2.65 శాతం దిగువకు, స్మాల్‌ క్యాప్‌ షేర్లు 3.06 శాతం పడిపోయాయి.
నిప్టీ పిఎస్‌యు బ్యాంక్‌ మరియు నిప్టీ ఆటో వరుసగా 3.20 శాతం, 2.71 శాతం తగ్గడం ద్వారా ఇండెక్స్‌ను బలహీనపరిచాయి. స్టాక్‌`స్పెసిఫిక్‌ ఫ్రంట్‌లో, అదానీ పోర్ట్స్‌ నిప్టీ లూజర్‌లో అగ్రస్థానంలో ఉంది. టాటా మోటార్స్‌, టాటా స్టీల్‌, ఙఖఒ, ఇండస్‌ఇండ్‌ బ్యాంక్‌ నష్టల్లో కొనసాగుతున్నాయి. నెస్లే మాత్రమే స్వల్ప లాభాలతో ఉంది