రహదారి భద్రతపై విద్యార్థుల బైక్‌ ర్యాలీ

కడప,డిసెంబర్‌29(జ‌నంసాక్షి):  హెల్మెట్‌ పై అవగాహన కలిగిస్తూ.. కడపలోని పల్లవోలు చైతన్య భారతి ఇన్ట్సిట్యూట్‌ ఆఫ్‌ టెక్నాలజి వారి ఆధ్వర్యంలో సిబిఐటి విద్యార్థులు శనివారం బైక్‌ ర్యాలీ నిర్వహించారు. రామేశ్వరం నుండి పుట్టపర్తి సర్కిల్‌ వరకు ఈ ర్యాలీని చేపట్టారు. ‘ రహదారి భద్రత మన అందరి బాధ్యత ‘ అంటూ నినాదాలు చేశారు. రోడ్డు ప్రమాదాలు జరగకుండా ప్రజలకు అవగాహన కల్పించాడానికి ఈ హెల్మెట్‌ బైక్‌ ర్యాలీ చేపట్టినట్లు ప్రిన్సిపల్‌ శ్రీనివాసులు రెడ్డి పేర్కొన్నారు. విద్యార్థులతో పాటు ఈ ర్యాలీలో కరస్పాండెంట్‌ జయచంద్ర రెడ్డి, ప్రిన్సిపల్‌ శ్రీనివాసులురెడ్డి డిటిసి బసిరెడ్డి, యంఐవి వాసుదేవరెడ్డి, డిఎస్‌పి శ్రీనివాసరావు, చైతన్య స్కూల్‌ ప్రిన్సిపల్‌ నాగిరెడ్డి లు పాల్గొన్నారు.