రాఖీ శుభాకాంక్షలతో సైకత శిల్పం

భువనేశ్వర్‌,ఆగస్ట్‌19 (జనం సాక్షి): సోదరి సోదరీమణుల పవిత్ర బంధవ్యానికి ప్రతీక రాఖీ పౌర్ణమి వేడుక. ఎంతో ఆప్యాయంగా తన సోదరుడికి రాఖీ కట్టి, నోరు తీపి చేసి తనకు అన్నీ శుభాలే కలగాలని, వారి బంధం కలకాలం ఇలాగే ఉండాలని ఆకాంక్షిస్తుంది. రక్త సంబంధం ఉన్నా లేకున్నా సోదరి రక్షా బంధనం కట్టి సోదరుడి నుంచి ఆశీస్సులు అందుకుంటుంది. తమ బంధం ఎప్పటికీ ఇలాగే ఉండాలని కోరుకుంటుంది. ఇంతటి ప్రతీక గల ఈ రాఖీ పౌర్ణమిని పురస్కరించుకొని సోదర సోదరీమణులకు ప్రముఖ సైకత శిల్పి సుదర్శన్‌ పట్నాయక్‌ శుభాకాంక్షలు తెలిపారు. ఈ మేరకు ఒడిశాలోని పూరీ తీరంలో ప్రత్యేక సైకత శిల్పాన్ని రూపొందించారు. ఇది అందరినీ విశేషంగా ఆకట్టుకుంటోంది.