రాజారాం గ్రామం మదీన మస్జిద్ కమిటీ సభ్యులు కాంగ్రెస్ పార్టీ నుండి కార్యకర బిఆర్ఎస్ పార్టీలో కి చేరికలు

ధర్మపురి (జనం సాక్షి)ధర్మపురి మండలం రాజారాం గ్రామ పర్యటనలో భాగంగా కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు షేక్ హైమద్, ఎస్.కె ఫసీ ఆధ్వర్యంలో 50 మంది యువకులు సంక్షేమ పథకాలకు మరియు గ్రామ అభివృద్ది కాంక్షిస్తూ గురువారం సంక్షేమ శాఖ మంత్రి కొప్పుల ఈశ్వర్ సమక్షంలో బిఆర్ఎస్ పార్టీలో చేరడం జరిగింది.
ఈ సందర్భంగా మంత్రి వారికి బిఆర్ఎస్ పార్టీ కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు..
ఈ కార్యక్రమంలో డిసిఎంఎస్ ఛైర్మన్ ఎల్లాల శ్రీకాంత్ రెడ్డి, జెడ్పీటీసీ బత్తిని అరుణ, సౌల్ల భీమయ్య, వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్మన్ అయ్యోరి రాజేష్, సర్పంచ్ లహరి మురళి, వక్ఫ్ బోర్డు సభ్యులు సయ్యద్ ఆసీఫ్ సింగిల్ విండో చైర్మన్ సౌళ్ళ నరేష్ మరియు పలువురు నేతలు పాల్గొన్నారు.